టాలీవుడ్ నిర్మాతల సినిమాల రిలీజ్ ప్లానింగ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కొంచెం క్రేజున్న సీజన్ వచ్చిందంటే చాలు వేలం వెర్రిగా సినిమాలు రిలీజ్ చేస్తారు. దీని వల్ల థియేటర్ల సమస్య తప్పదు. ఎక్కువ ఆప్షన్లు ఉండడం వల్ల ప్రేక్షకులు ఏ సినిమాకు వెళ్లాలో తెలియని అయోమయంలో పడుతుంటారు. కానీ ప్రేక్షకులు ఏదైనా సినిమా చూద్దాం అని ఎదురు చూస్తున్న సమయంలో థియేటర్లలో అసలు చెప్పుకోదగ్గ చిత్రాలే ఉండవు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు పరిస్థితి తయారవుతోంది.
ఈ నెల రెండో వారంలో దసరా వీకెండ్ను పురస్కరించుకుని ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కానీ తర్వాత చూస్తే బాక్సాఫీస్ ఖాళీ అయిపోయింది. గత వారం ‘లవ్ రెడ్డి’ అనే చిన్న సినిమా ఒక్కటి కాస్త చెప్పుకోదగ్గది. అది కూడా ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయింది. మిగతా సినిమాల గురించి మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు.
ఇక ఈ వారమేమో ‘పొట్టేల్’ అనే చిన్న సినిమా మీద కొంచెం చర్చ జరుగుతోంది. ఇది కాక ఏవో చిన్నా చితకా చిత్రాలు కొన్ని రిలీజవుతున్నాయి. అవి అస్సలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించట్లేదు. ఇలా రెండు వారాలను ఖాళీగా వదిలేసిన టాలీవుడ్ నిర్మాతలు నెలాఖర్లో దీపావళి వీకెండ్ కోసం కొట్టేసుకుంటున్నారు. ఆ వారం లక్కీ భాస్కర్, క, జీబ్రాలతో పాటు అమరన్, భగీరా అనే అనువాద చిత్రాలు కూడా పోటీకి సై అంటున్నాయి.
ఒకే రోజు ఐదు కొత్త సినిమాల రిలీజ్ అంటే మ్యాడ్ రష్ అన్నట్లే. ఇంత పోటీ వల్ల ప్రయోజనం ఉండదు. దీని బదులు ఒకట్రెండు సినిమాలను ముందు రెండు వారాల్లో రిలీజ్ చేసి ఉంటే మేలు జరిగేదే. థియేటర్లకూ ఫీడ్ ఇచ్చినట్లుండేది. ప్రేక్షకుల దృష్టిలో పడడానికి కూడా అవకాముండేది. ముందు దీపావళికి అనుకున్న మెకానిక్ రాకీ, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలను తర్వాతి వారాలకు వాయిదా వేశారు. అవి సోలోగా రిలీజ్ కాబోతున్నాయి. అందువల్ల వాటికి అడ్వాంటేజ్ ఉంటుంది. దీపావళి సినిమాల విషయంలో ఇప్పటికైనా ఆలోచించి ఒకట్రెండు చిత్రాలను రేసు నుంచి తప్పిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on October 21, 2024 3:59 pm
వైసీపీ అధినేత జగన్ తమపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం.. హైకోర్టును ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ…
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే..…
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…