టాలీవుడ్ నిర్మాతల సినిమాల రిలీజ్ ప్లానింగ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కొంచెం క్రేజున్న సీజన్ వచ్చిందంటే చాలు వేలం వెర్రిగా సినిమాలు రిలీజ్ చేస్తారు. దీని వల్ల థియేటర్ల సమస్య తప్పదు. ఎక్కువ ఆప్షన్లు ఉండడం వల్ల ప్రేక్షకులు ఏ సినిమాకు వెళ్లాలో తెలియని అయోమయంలో పడుతుంటారు. కానీ ప్రేక్షకులు ఏదైనా సినిమా చూద్దాం అని ఎదురు చూస్తున్న సమయంలో థియేటర్లలో అసలు చెప్పుకోదగ్గ చిత్రాలే ఉండవు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు పరిస్థితి తయారవుతోంది.
ఈ నెల రెండో వారంలో దసరా వీకెండ్ను పురస్కరించుకుని ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కానీ తర్వాత చూస్తే బాక్సాఫీస్ ఖాళీ అయిపోయింది. గత వారం ‘లవ్ రెడ్డి’ అనే చిన్న సినిమా ఒక్కటి కాస్త చెప్పుకోదగ్గది. అది కూడా ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయింది. మిగతా సినిమాల గురించి మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు.
ఇక ఈ వారమేమో ‘పొట్టేల్’ అనే చిన్న సినిమా మీద కొంచెం చర్చ జరుగుతోంది. ఇది కాక ఏవో చిన్నా చితకా చిత్రాలు కొన్ని రిలీజవుతున్నాయి. అవి అస్సలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించట్లేదు. ఇలా రెండు వారాలను ఖాళీగా వదిలేసిన టాలీవుడ్ నిర్మాతలు నెలాఖర్లో దీపావళి వీకెండ్ కోసం కొట్టేసుకుంటున్నారు. ఆ వారం లక్కీ భాస్కర్, క, జీబ్రాలతో పాటు అమరన్, భగీరా అనే అనువాద చిత్రాలు కూడా పోటీకి సై అంటున్నాయి.
ఒకే రోజు ఐదు కొత్త సినిమాల రిలీజ్ అంటే మ్యాడ్ రష్ అన్నట్లే. ఇంత పోటీ వల్ల ప్రయోజనం ఉండదు. దీని బదులు ఒకట్రెండు సినిమాలను ముందు రెండు వారాల్లో రిలీజ్ చేసి ఉంటే మేలు జరిగేదే. థియేటర్లకూ ఫీడ్ ఇచ్చినట్లుండేది. ప్రేక్షకుల దృష్టిలో పడడానికి కూడా అవకాముండేది. ముందు దీపావళికి అనుకున్న మెకానిక్ రాకీ, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలను తర్వాతి వారాలకు వాయిదా వేశారు. అవి సోలోగా రిలీజ్ కాబోతున్నాయి. అందువల్ల వాటికి అడ్వాంటేజ్ ఉంటుంది. దీపావళి సినిమాల విషయంలో ఇప్పటికైనా ఆలోచించి ఒకట్రెండు చిత్రాలను రేసు నుంచి తప్పిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on October 21, 2024 3:59 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…