తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక కొత్త ఒరవడి సృష్టించిన సీరియళ్లలో ‘మొగిలి రేకులు’ ఒకటి. ఆ సీరియల్తో తిరుగులేని పాపులారిటీ సంపాదించాడు సాగర్. ఈ పేరుతో కంటే తన క్యారెక్టర్ పేరైన ‘ఆర్కే నాయుడు’గా ఎక్కువ మందికి తెలుసు సాగర్. అంతకుముందు కూడా కొన్ని సీరియళ్లలో, సినిమాల్లో నటించినప్పటికీ ఈ ఒక్క పాత్రతో అతను టీవీ రంగంలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించాడు.
ఈ ఆదరణను ఉపయోగించుకుందామని ‘సిద్దార్థ’ పేరుతో ఓ సినిమా కూడా చేశాడతను. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో మళ్లీ హీరోగా ప్రయత్నించలేదు. టీవీ సీరియళ్లలోనూ నటించలేదతను. ఐతే కొన్నేళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయిన సాగర్.. మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. అతను హీరోగా ఒకటికి రెండు సినిమాలు ఒకేసారి అనౌన్స్ కావడం విశేషం.
ఇప్పటికే దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత సంస్థలో ‘షాదీ ముబారక్’ అనే సినిమా చేస్తున్నాడు సాగర్. పద్మశ్రీ అనే మహిళా దర్శకురాలు రూపొందిస్తున్న ఈ చిత్రంలో దృశ్య రఘునాథ్ అనే మలయాళ అమ్మాయి కథానాయికగా నటిస్తోంది. దీని ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. ఇంతలో సాగర్ హీరోగా మరో సినిమా వార్తల్లోకి వచ్చింది. రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి నిర్మాతగా.. సాగర్ హీరోగా ఓ సినిమాను ప్రకటించాడు.
గౌతమ్ మీనన్ దగ్గర శిష్యరికం చేసిన రమేష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఒక ప్రముఖ కథానాయికగా ఇందులో సాగర్ సరసన నటిస్తుందట. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అంటున్నారు. ఒకప్పుడు సీరియళ్లలో ఎంత పాపులారిటీ ఉన్నప్పటికీ.. కొన్నేళ్లుగా అసలు లైమ్ లైట్లో లేని సాగర్ను పెట్టి ఒకరికిద్దరు ప్రముఖులు ఇలా సినిమాలు తీయడానికి ముందుకు రావడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on October 1, 2020 5:11 pm
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…