సల్మాన్ ఖాన్ పేరు ఇటీవల బాగా మీడియాలో నానుతున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయన ప్రాణ హాని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కృష్ణజింకలను వేటాడిన కేసులో నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు సల్మాన్ బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఆయన సన్నిహితుడైన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఆ హత్య వెనుక ఉన్నది గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని తేలింది.
ఈ క్రమంలోనే సల్మాన్కు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తాము పరమ పవిత్రంగా భావించే కృష్ణజింకలను వేటాడిన కేసులో నిందితుడైన సల్మాన్.. ఓ ఆలయానికి వచ్చి క్షమాపణ చెప్పాలని.. లేదంటే ఆయన్ని చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సల్మాన్కు భద్రదత పెంచారు.
ఐతే కొన్ని రోజులు విరామం తీసుకున్న సల్మాన్ తాజాగా ‘బిగ్ బాస్’ షో చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయనకు 60 మంది భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఈ షోలో తనకు వచ్చిన బెదిరింపుల గురించి సల్మాన్ పరోక్షంగా మాట్లాడారు.
“హౌస్లో ఉన్నపుడు ఇంటి సభ్యులు ఎలాంటి ఫీలింగ్స్ చూపించినా వాటిని పట్టించుకోకూడదు. నేను కూడా ఈ రోజు ఇక్కడికి రాకూడదనుకున్నా. అస్సలు రావాలనిపించలేదు. ఇటీవలి పరిణామాలతో మీతో పాటు ఎవ్వరినీ కలవకూడదనుకున్నా. కాకపోతే ఇది నా వృత్తి. కాబట్టి తప్పకుండా రావాలి. వృత్తి పట్ల నిబద్ధత వల్లే అన్నింటినీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చా. దీనికి పూర్తిగా కట్టుబడి ఉన్నా” అని సల్మాన్ వ్యాఖ్యానించాడు. తనకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో డిస్టర్బ్ అయిన సల్మాన్ ఈ కామెంట్స్ చేశాడని భావిస్తున్నారు.
This post was last modified on October 21, 2024 10:49 am
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…