హీరోలు డైరెక్షన్ చేయడం కొత్తేమీ కాదు. ఎన్టీ రామారావు నుంచి విశ్వక్సేన్ వరకు తెలుగులో మెగా ఫోన్ పట్టిన హీరోలు చాలామందిని చూశాం. తమిళంలో కూడా ఇలాంటి హీరో టర్న్డ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఐతే ఇప్పుడు ఓ హీరో డైరెక్షన్ చేయబోతుండడమే ఆశ్చర్యం అంటే.. అతను ఎంచుకున్న హీరో మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. మెగా ఫోన్ పట్టబోతున్న ఆ హీరో జయం రవి కాగా.. దర్శకుడిగా తన తొలి చిత్రంలో లీడ్ రోల్ చేయబోయేది కమెడియన్ యోగి బాబు అట. ఈ విషయాన్ని యోగిబాబునే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
యోగిబాబు కమెడియన్గా చాలా పెద్ద స్థాయికి ఎదిగాడు తమిళంలో. అతణ్ని ప్రధాన పాత్రలో పెట్టి సినిమాలు కూడా తీశారు. అందులో ‘మండేలా’ కల్ట్ మూవీగా నిలిచింది. అది కమర్షియల్గా కూడా పెద్ద సక్సెస్ అయింది. దీంతో యోగిబాబును హీరోగా పెట్టి మరి కొన్ని సినిమాలు తీశారు. ఐతే వర్ధమాన దర్శకులు యోగిబాబుతో సినిమాలు తీయాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు కానీ.. జయం రవి అతణ్ని పెట్టి సినిమా డైరెక్ట్ చేయాలనుకోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.
యోగిబాబుతో జయం రవికి మంచి స్నేహం ఉంది. తన సినిమాలు చాలా వాటిలో యోగి కమెడియన్గా చేశాడు. ఒకప్పటి నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడైన జయం రవి.. తన అన్న మోహన్ రాజా లాగే ముందు దర్శకుడు కావాలనే అనుకున్నాడు. కమల్ హాసన్ మూవీ ‘ఆలవందాన్’ (అభయ్)కి సురేష్ కృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. కానీ మంచి లుక్స్ ఉన్న అతణ్ని ఎడిటర్ మోహన్ హీరోగా పరిచయం చేశాడు. ‘జయం’కు రీమేక్గా తెరకెక్కిన తన తొలి చిత్రం రవికే కాక దర్శకుడిగా మోహన్ రాజాకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఇద్దరూ ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు.
This post was last modified on October 21, 2024 10:28 am
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…