హీరోలు డైరెక్షన్ చేయడం కొత్తేమీ కాదు. ఎన్టీ రామారావు నుంచి విశ్వక్సేన్ వరకు తెలుగులో మెగా ఫోన్ పట్టిన హీరోలు చాలామందిని చూశాం. తమిళంలో కూడా ఇలాంటి హీరో టర్న్డ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఐతే ఇప్పుడు ఓ హీరో డైరెక్షన్ చేయబోతుండడమే ఆశ్చర్యం అంటే.. అతను ఎంచుకున్న హీరో మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. మెగా ఫోన్ పట్టబోతున్న ఆ హీరో జయం రవి కాగా.. దర్శకుడిగా తన తొలి చిత్రంలో లీడ్ రోల్ చేయబోయేది కమెడియన్ యోగి బాబు అట. ఈ విషయాన్ని యోగిబాబునే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
యోగిబాబు కమెడియన్గా చాలా పెద్ద స్థాయికి ఎదిగాడు తమిళంలో. అతణ్ని ప్రధాన పాత్రలో పెట్టి సినిమాలు కూడా తీశారు. అందులో ‘మండేలా’ కల్ట్ మూవీగా నిలిచింది. అది కమర్షియల్గా కూడా పెద్ద సక్సెస్ అయింది. దీంతో యోగిబాబును హీరోగా పెట్టి మరి కొన్ని సినిమాలు తీశారు. ఐతే వర్ధమాన దర్శకులు యోగిబాబుతో సినిమాలు తీయాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు కానీ.. జయం రవి అతణ్ని పెట్టి సినిమా డైరెక్ట్ చేయాలనుకోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.
యోగిబాబుతో జయం రవికి మంచి స్నేహం ఉంది. తన సినిమాలు చాలా వాటిలో యోగి కమెడియన్గా చేశాడు. ఒకప్పటి నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడైన జయం రవి.. తన అన్న మోహన్ రాజా లాగే ముందు దర్శకుడు కావాలనే అనుకున్నాడు. కమల్ హాసన్ మూవీ ‘ఆలవందాన్’ (అభయ్)కి సురేష్ కృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. కానీ మంచి లుక్స్ ఉన్న అతణ్ని ఎడిటర్ మోహన్ హీరోగా పరిచయం చేశాడు. ‘జయం’కు రీమేక్గా తెరకెక్కిన తన తొలి చిత్రం రవికే కాక దర్శకుడిగా మోహన్ రాజాకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఇద్దరూ ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు.
This post was last modified on October 21, 2024 10:28 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…