ఇంకో యాభై రోజుల కంటే తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ బిజినెస్ ఒప్పందాలు హాట్ కేకుల్లా జరిగిపోతున్నాయి. ఎన్నడూ లేనిది థియేటర్ యజమానులతో చేసుకున్న అగ్రిమెంట్ల తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. దీన్ని బట్టి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైప్ దృష్ట్యా మైత్రి మూవీ మేకర్స్ ఆశించిన దానికన్నా ఎక్కువ మొత్తమే డిస్ట్రిబ్యూటర్లు ఆఫర్ చేసినట్టుగా ట్రేడ్ టాక్. అధికారికంగా ఇలాంటి లెక్కలు బయటికి రావు కానీ పంపిణి వర్గాల్లో తిరుగుతున్న నెంబర్లు చూస్తుంటే ఆర్ఆర్ఆర్, కల్కిలనే టార్గెట్ చేసేలా ఉన్నాయి.
అనఫీషియల్ సోర్స్ ప్రకారం పుష్ప 2కి ఏపీ, తెలంగాణ కలిపి సుమారు 215 కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. నైజామ్ ప్రాంతంలో మైత్రి స్వంతంగా వంద కోట్ల బ్రేక్ ఈవెన్ పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా, సీడెడ్ 30 కోట్లకు అభిషేక్, వైజాగ్ 23.5 కోట్లకు సాయి కొర్రపాటి, ఈస్ట్ 14.5 కోట్లకు మైత్రి, వెస్ట్ 10.8 కోట్లకు ఎల్విఆర్, కృష్ణ 12.5 కోట్లకు బన్నీ వాస్, గుంటూరు 15.5 కోట్లకు యువి వంశీ, నెల్లూరు 7.5 కోట్లకు భాస్కర్ హక్కులు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇది ఖరారుగా చెప్పలేం కానీ కొంచెం అటుఇటుగా ఈ మొత్తాలకే అగ్రిమెంట్లు జరిగాయని వినిపిస్తోంది. హైప్ అలా ఉంది మరి.
ఈ అంకెల సంగతి పక్కనపెడితే పుష్ప 2 మానియా ఇంకా ప్రమోషన్లు మొదలు కాకుండానే పీక్స్ లో ఉన్న సంగతి అర్థమైపోతుంది. సుకుమార్ ప్రస్తుతం బ్యాలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కారణంగా ఇంకా పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టలేదు. ఐటెం సాంగ్ చిత్రీకరణ కాగానే కంటెంట్ బయటికి వదలబోతున్నారు.
నార్త్ ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న కారణంగా ప్రత్యేకంగా బాలీవుడ్ వెర్షన్ మీద దృష్టి పెట్టబోతున్నారు. డిసెంబర్ 6 రిలీజ్ డేట్ అయినప్పటికీ ఒక రోజు ముందు ప్రీమియర్లు వేసే అవకాశాన్ని నిర్మాతలు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. దాదాపు ఖరారవుతాయి.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…