కరోనా టైంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎలా రైజ్ అయ్యాయో తెలిసిందే. జనాలు థియేటర్లకు వెళ్లలేని అప్పటి పరిస్థితులను ఉపయోగించుకోవడానికి ఓటీటీలో భారీ పెట్టుబడులు పెట్టాయి. నిర్మాతలు ఊహించని రేట్లు ఇచ్చి కొత్త సినిమాలను కొన్నాయి. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తే పెట్టుబడి మీద మంచి లాభాలు వస్తుండడంతో చాలామంది నిర్మాతలు అలాగే తమ చిత్రాలను రిలీజ్ చేసుకున్నారు. అంతే కాక థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎంత త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తే అంత మంచి రేట ఇవ్వడం మొదలుపెట్టడంతో నిర్మాతలు టెంప్ట్ అవడం మొదలుపెట్టారు.
కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. డిజిటల్ హక్కుల రేట్లు పడిపోయాయి. ఓటీటీలు అన్ని సినిమాలనూ కొనట్లేదు. కొనే వాటికి కూడా ఆశించిన రేట్లు ఇవ్వట్లేదు. పైగా ఎన్నో షరతులు కూడా తప్పట్లేదు. డిజిటల్ ఆదాయం చూసుకుని బడ్జెట్లు, పారితోషకాలు పెంచుకున్న నిర్మాతలు ఇప్పుడు పడిపోయిన రేట్లతో సతమతం అవుతున్నారు.
ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. ఓటీటీలు రిలీజ్ డేట్లను కూడా శాసించే పరిస్థితులు నెలకొన్నాయి. తాము చెప్పినపుడు సినిమాను రిలీజ్ చేస్తేనే ఈ రేటు.. కాదంటే తక్కువ ధర అని షరతులు పెడుతున్నాయి. సంక్రాంతి సినిమాల విషయంలో రిలీజ్ డేట్ల మార్పులు చేర్పులతో ఆయా చిత్రాల డిజిటల్ రేట్లు కూడా మారిపోయినట్లు తెలుస్తోంది. క్రిస్మస్కు అనుకున్న గేమ్ చేంజర్, తండేల్ చిత్రాలు సంక్రాంతికి వాయిదా పడడంతో వాటి రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం.
సంక్రాంతికి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి బాగా ఉత్సాహం చూపిస్తారు. మామూలు సమయాల్లో కంటే సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతుంది. అందువల్ల సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వస్తే వ్యూయర్ షిప్ తక్కువ ఉంటోందన్నది ఒక పరిశీలన. దీంతో ఓటీటీలు సంక్రాంతి చిత్రాలకు రేట్లు తగ్గిస్తున్నాయట. ఐతే ఇక్కడ పడే లోటును థియేట్రికల్ ఆదాయంతో పూడ్చుకోవచ్చనే ఉద్దేశంతో సంక్రాంతి రిలీజ్కు సై అంటున్నారు నిర్మాతలు.
This post was last modified on October 19, 2024 5:59 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…