కరోనా టైంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎలా రైజ్ అయ్యాయో తెలిసిందే. జనాలు థియేటర్లకు వెళ్లలేని అప్పటి పరిస్థితులను ఉపయోగించుకోవడానికి ఓటీటీలో భారీ పెట్టుబడులు పెట్టాయి. నిర్మాతలు ఊహించని రేట్లు ఇచ్చి కొత్త సినిమాలను కొన్నాయి. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తే పెట్టుబడి మీద మంచి లాభాలు వస్తుండడంతో చాలామంది నిర్మాతలు అలాగే తమ చిత్రాలను రిలీజ్ చేసుకున్నారు. అంతే కాక థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎంత త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తే అంత మంచి రేట ఇవ్వడం మొదలుపెట్టడంతో నిర్మాతలు టెంప్ట్ అవడం మొదలుపెట్టారు.
కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. డిజిటల్ హక్కుల రేట్లు పడిపోయాయి. ఓటీటీలు అన్ని సినిమాలనూ కొనట్లేదు. కొనే వాటికి కూడా ఆశించిన రేట్లు ఇవ్వట్లేదు. పైగా ఎన్నో షరతులు కూడా తప్పట్లేదు. డిజిటల్ ఆదాయం చూసుకుని బడ్జెట్లు, పారితోషకాలు పెంచుకున్న నిర్మాతలు ఇప్పుడు పడిపోయిన రేట్లతో సతమతం అవుతున్నారు.
ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. ఓటీటీలు రిలీజ్ డేట్లను కూడా శాసించే పరిస్థితులు నెలకొన్నాయి. తాము చెప్పినపుడు సినిమాను రిలీజ్ చేస్తేనే ఈ రేటు.. కాదంటే తక్కువ ధర అని షరతులు పెడుతున్నాయి. సంక్రాంతి సినిమాల విషయంలో రిలీజ్ డేట్ల మార్పులు చేర్పులతో ఆయా చిత్రాల డిజిటల్ రేట్లు కూడా మారిపోయినట్లు తెలుస్తోంది. క్రిస్మస్కు అనుకున్న గేమ్ చేంజర్, తండేల్ చిత్రాలు సంక్రాంతికి వాయిదా పడడంతో వాటి రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం.
సంక్రాంతికి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి బాగా ఉత్సాహం చూపిస్తారు. మామూలు సమయాల్లో కంటే సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతుంది. అందువల్ల సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వస్తే వ్యూయర్ షిప్ తక్కువ ఉంటోందన్నది ఒక పరిశీలన. దీంతో ఓటీటీలు సంక్రాంతి చిత్రాలకు రేట్లు తగ్గిస్తున్నాయట. ఐతే ఇక్కడ పడే లోటును థియేట్రికల్ ఆదాయంతో పూడ్చుకోవచ్చనే ఉద్దేశంతో సంక్రాంతి రిలీజ్కు సై అంటున్నారు నిర్మాతలు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…