సుకుమార్ సినిమా అంటే కథ ఎలాంటిదైనా అందులో ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ‘రంగస్థలం’ లాంటి సీరియస్ మూవీలో కూడా పూజా హెగ్డేతో ఐటెం సాంగ్ పెట్టించాడు సుకుమార్. తర్వాతి చిత్రం ‘పుష్ప: ది రైజ్’లో సమంతతో ఐటెం సాంగ్ చేయించాడు. ‘ఊ అంటావా మావా..’ అంటూ సాగే ఆ పాట ఎంత పాపులర్ అయిదో.. జనాలను ఎలా ఊపేసిందో తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప-2’లోనూ ఐటెం సాంగ్ ఉంటుందనడంలో ఎవరికీ సందేహాలు లేవు.
ఐతే రిలీజ్కు సమయం నెలన్నరే ఉండగా.. ఇంకా ఆ పాట చిత్రీకరించలేదు. ఇంతకీ ఆ పాటలో ఎవరు కనిపిస్తారనే సస్పెన్స్ కూడా కొనసాగుతోంది. ఇంతకుముందు రకరకాల పేర్లు వినిపించాయి. చివరగా తెరపైకి వచ్చిన పేరు.. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్దే. తాజా సమాచారం ప్రకారం పుష్ప-2 ఐటెం సాంగ్కు ఆమెనే ఖరారైపోయింది.
రెండు రోజుల కిందటే ‘పుష్ప-2’ నిర్మాతలు శ్రద్ధా కపూర్కు అడ్వాన్స్ ఇచ్చేశారు. ఇంకొన్ని రోజుల్లోనే ఆ పాట చిత్రీకరణ ఉంటుంది. ఇటీవలే ‘స్త్రీ-2’ రికార్డ్ బ్రేకింగ్ హిట్ అయిన నేపథ్యంలో శ్రద్ధా డిమాండ్ మామూలుగా లేదు. ఆమె భారీ పారితోషకం అడిగినా.. హిందీలో తనకున్న మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు వెనుకంజ వేయలేదు. ‘పుష్ప-2’కు హిందీలో కూడా బంపర్ క్రేజ్ ఉంది. ఇక శ్రద్ధా ఐటెం సాంగ్ చేస్తే అక్కడి జనం మరింత ఊగిపోతారనడంలో సందేహం లేదు.
ఈ పాట కూడా ‘ఊ అంటావా..’ స్థాయిలో ఉంటే దాని రీచ్ మామూలుగా ఉండదు. ఈ పాటకు గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూరుస్తారని.. దేవిశ్రీ ప్రసాద్ మంచి ఊపున్న పాటనే కంపోజ్ చేశాడని సమాచారం. నవంబరు తొలి వారంలో ఈ పాట చిత్రీకరణ ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే టాకీ పార్ట్ పూర్తి కానుంది. తర్వాత ఐటెం సాంగ్తో పాటు మరో పాట కూడా షూట్ చేయాల్సి ఉంది. ‘పుష్ప-2’ డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…