Movie News

పుష్ప-2 ఐటెం సాంగ్.. ఆమెనే ఫిక్స్

సుకుమార్ సినిమా అంటే కథ ఎలాంటిదైనా అందులో ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ‘రంగస్థలం’ లాంటి సీరియస్ మూవీలో కూడా పూజా హెగ్డేతో ఐటెం సాంగ్ పెట్టించాడు సుకుమార్. తర్వాతి చిత్రం ‘పుష్ప: ది రైజ్’లో సమంతతో ఐటెం సాంగ్ చేయించాడు. ‘ఊ అంటావా మావా..’ అంటూ సాగే ఆ పాట ఎంత పాపులర్ అయిదో.. జనాలను ఎలా ఊపేసిందో తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప-2’లోనూ ఐటెం సాంగ్ ఉంటుందనడంలో ఎవరికీ సందేహాలు లేవు.

ఐతే రిలీజ్‌కు సమయం నెలన్నరే ఉండగా.. ఇంకా ఆ పాట చిత్రీకరించలేదు. ఇంతకీ ఆ పాటలో ఎవరు కనిపిస్తారనే సస్పెన్స్ కూడా కొనసాగుతోంది. ఇంతకుముందు రకరకాల పేర్లు వినిపించాయి. చివరగా తెరపైకి వచ్చిన పేరు.. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌దే. తాజా సమాచారం ప్రకారం పుష్ప-2 ఐటెం సాంగ్‌కు ఆమెనే ఖరారైపోయింది.

రెండు రోజుల కిందటే ‘పుష్ప-2’ నిర్మాతలు శ్రద్ధా కపూర్‌కు అడ్వాన్స్ ఇచ్చేశారు. ఇంకొన్ని రోజుల్లోనే ఆ పాట చిత్రీకరణ ఉంటుంది. ఇటీవలే ‘స్త్రీ-2’ రికార్డ్ బ్రేకింగ్ హిట్ అయిన నేపథ్యంలో శ్రద్ధా డిమాండ్ మామూలుగా లేదు. ఆమె భారీ పారితోషకం అడిగినా.. హిందీలో తనకున్న మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు వెనుకంజ వేయలేదు. ‘పుష్ప-2’కు హిందీలో కూడా బంపర్ క్రేజ్ ఉంది. ఇక శ్రద్ధా ఐటెం సాంగ్ చేస్తే అక్కడి జనం మరింత ఊగిపోతారనడంలో సందేహం లేదు.

ఈ పాట కూడా ‘ఊ అంటావా..’ స్థాయిలో ఉంటే దాని రీచ్ మామూలుగా ఉండదు. ఈ పాటకు గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూరుస్తారని.. దేవిశ్రీ ప్రసాద్ మంచి ఊపున్న పాటనే కంపోజ్ చేశాడని సమాచారం. నవంబరు తొలి వారంలో ఈ పాట చిత్రీకరణ ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే టాకీ పార్ట్ పూర్తి కానుంది. తర్వాత ఐటెం సాంగ్‌తో పాటు మరో పాట కూడా షూట్ చేయాల్సి ఉంది. ‘పుష్ప-2’ డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on October 19, 2024 5:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago