వెంకటేష్ 76ని వేగంగా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడికి సంకట పరిస్థితి వచ్చి పడిందని ఇన్ సైడ్ టాక్. ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల కావాలి. ఆ మేరకు షూటింగ్ ప్రారంభం కాక ముందే ప్రీ లుక్ పోస్టర్ లో ఆ విషయాన్ని హైలైట్ చేశారు. కానీ తర్వాత జరిగిన అనుకోని పరిణామాల వల్ల లెక్కలు మారిపోయి రేసులోకి గేమ్ ఛేంజర్ వచ్చింది. రెండింటి నిర్మాత దిల్ రాజే కాబట్టి వెంకీ మూవీని వాయిదా వేస్తే బాగుంటుందనే అభిప్రాయం బయ్యర్ వర్గాల్లో ఉంది. దానికి సానుకూలంగానే నిర్ణయం జరగొచ్చని అంటున్నారు.
కానీ వెంకటేష్ కేమో పండగ డేట్ ని వదులుకోవడం ఇష్టం లేదు. కలిసుందాం రా, ఎఫ్ 2 లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సీజన్ గా మరోసారి సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. అనిల్ రావిపూడికి సైతం ఇదే ఉంది. సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2 హిట్లు కొట్టింది సంక్రాంతికే. కానీ రాజుగారు మాత్రం హీరోని కన్విన్స్ చేసే బాధ్యతని అనిల్ మీదే పెట్టినట్టు వినికిడి. అంత సులభంగా ఆ మాటను కాదనలేరు. ఎందుకంటే డెబ్యూ మూవీ రాజా ది గ్రేట్ అవకాశం ఇచ్చిన దిల్ రాజు స్వయంగా అడిగితే వెంటనే నో చెప్పడానికి అనిల్ కు ఎలా మనస్కరిస్తుంది. కానీ వెంకటేష్ తోనూ అంతే చనువుంది.
సో ఫైనల్ గా ఏమవుతుందో కానీ వెంకీ ఫ్యాన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు. పక్కకు తప్పించి మాకు అన్యాయం చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. నిజానికి ఒకే సంస్థ రెండు సినిమాలు సంక్రాంతికి రావొచ్చని గతంలో మైత్రి చేసి చూపించింది. కానీ దిల్ రాజుకు గేమ్ ఛేంజర్ తో పాటు బాలయ్య 109 డిస్ట్రిబ్యూషన్ బాధ్యత ఉంటుంది. సో థియేటర్ల సర్దుబాటు పెద్ద సమస్య కావొచ్చు. మంచి ఎంటర్ టైనర్ అయిన వెంకటేష్ సినిమాని ఎప్పుడు తీసుకొచ్చినా ఆడుతుందనే నమ్మకం ఆయనలో ఉందట. చివరికి ఈ కథ ఎటెటు తిరిగి ఏ కంక్లూజన్ కు వస్తుందో ఇంకొద్ది రోజులు ఆగి చూడాలి.
This post was last modified on October 19, 2024 12:06 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…