కొందరు దర్శకులు కమర్షియల్ ప్రపంచానికి దూరంగా తమదైన శైలిలో కొత్త జానర్లు టచ్ చేస్తూ, ఎప్పుడూ చూడని కథలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇదే వీళ్ళను ఇతరుల కంటే భిన్నంగా గుర్తింపు తెచ్చుకునేలా చేస్తుంది. అలాంటి వాళ్లలో వెట్రిమారన్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అంతటివాడే స్వయంగా తనకు ఆయనతో సినిమా చేయాలని ఉందని, డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం ఎంతగా హైలైట్ అయ్యిందో చూశాం. అదే కోవలోకి వస్తాడు టీజె జ్ఞానవేల్. సూర్యతో జై భీం తీసినప్పుడు ఎన్ని గొప్ప ప్రశంసలు వచ్చాయో, జనంలో ఎంతగా ముద్రించుకుపోయిందో చూశాం.
కట్ చేస్తే వేట్టయన్ పుణ్యమాని టీజె జ్ఞానవేల్ ఒక మాములు రెగ్యులర్ డైరెక్టర్ గా కనిపించేశాడు. రజనీకాంత్ సూపర్ స్టార్ ఇమేజ్ ని మ్యాచ్ చేసే ఉద్దేశంతో సీరియస్ కథలో జొప్పించి మాస్ అంశాలు ఎవరినీ మెప్పించలేక మూవీని ఫ్లాప్ దిశగా నడిపించాయి. నిర్మాతలు పదే పదే రెండు వందల కోట్లు దాటిందని పోస్టర్లు వేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉందనేది ఎవరూ కాదనలేరు. ఫేక్ ఎన్కౌంటర్ చుట్టూ స్క్రీన్ ప్లేని ఆధారంగా చేసుకుని అద్భుతమైన డ్రామా పండించవచ్చు. కానీ అవసరం లేని ఎలివేషన్ ఫైట్లు, రొటీన్ అనిపించే రానా విలనిజం లాంటివి వేట్టయన్ కు నెగటివ్ గా మారాయి.
గతంలో కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. పేట తమిళంలో బాగానే ఆడింది కానీ ఇతర భాషల్లో యావరేజ్ కంటే కిందే నిలిచిపోయింది. అతను కూడా రజని స్వాగ్ ని చూపించే ప్రయత్నంలో పాత కథనే చెప్పాడు. ఇప్పుడు టీజె జ్ఞానవేల్ పరిస్థితి కూడా అదే అయ్యింది. ఒక్క నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రమే జైలర్ రూపంలో బ్లాక్ బస్టర్ సాధించాడు కానీ యునానిమస్ గా అందరు ఫ్యాన్స్ మెప్పించేలా ఏ దర్శకుడు రజనిని చూపించలేకపోయాడు. రోబో, చంద్రముఖి, నరసింహ, బాషా నాటి రజనిని బయటికి తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే డైరెక్టర్ల పాలిట ఉచ్చుగా మిగిలిపోయింది.
This post was last modified on October 18, 2024 12:57 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…