థియేటర్లలో రిలీజై రెండేళ్లు దాటిపోయింది కాబట్టి ఏదో టీవీలో వచ్చినప్పుడో, యూట్యూబ్ లో క్లిప్పులు చూసినప్పుడో తప్ప ఆర్ఆర్ఆర్ ని ప్రేక్షకులు అదే పనిగా గుర్తుకు తెచ్చుకోవడం ఇప్పుడైతే లేదు. ఎన్ని రికార్డులు నమోదు చేసినా యాభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చేసిన ఈ ప్యాన్ ఇండియా గ్రాండియర్ ప్రపంచంలో ఒక చోట ఏడాదికి పైగానే ఆడుతోందంటే నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఏదో ఫ్యాన్స్ డబ్బులిచ్చి బలవంతంగా ఆడించే వ్యవహారమని కొట్టి పారేయడానికి ఆడుతోంది ఏపీ, తెలంగాణలోని మారుమూల ఊళ్ళో కాదు. అసలు టాలీవుడ్దంటే ఏంటో తెలియని జపాన్ దేశంలో.
జపాన్ లో 71 సంవత్సరాల చరిత్ర కలిగిన టుసాగుచి సాన్ సాన్ అనే థియేటర్లో ఆర్ఆర్ఆర్ 1 సంవత్సరం 9 నెలలుగా ఆడుతూనే ఉంది. రోజూ ఒకటి రెండు రెగ్యులర్ షోలతో ఏ రోజూ ఆపకుండా స్క్రీనింగ్ చేస్తూనే వచ్చారు. ఇంత సుదీర్ఘమైన రన్ తెచ్చుకున్న మొదటి ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ అక్కడ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ సుదీర్ఘమైన పరుగుకు ఇప్పుడు ముగింపు పలకబోతున్నారు. ఇదే చివరి వారంగా యాజమాన్యం ప్రకటించింది. ఇంత ఆడినా రేపు శనివారం వేస్తున్న షోకు సంబంధించిన టికెట్లు అడ్వాన్స్ గా అన్నీ అమ్ముడుపోవడం అసలు ట్విస్టు.
రాజమౌళి గ్రాండియర్ ని జపాన్ ఆడియన్స్ ఎంతగా సొంతం చేసుకున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో పట్టుమని వంద రోజులు ఆడటమే కలగా మారిన పరిస్థితిలో ఏకంగా నాన్ ఇంగ్లీష్ కంట్రీలో ఇలాంటి ఫీట్ సాధించడమంటే జక్కన్న మేజిక్ కాక మరేమిటి. ఇప్పుడు సెలవు తీసుకున్నా తిరిగి కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేస్తారని అక్కడి మీడియా టాక్. అన్నట్టు మనం ఏనాడో మర్చిపోయిన డివిడి, బ్లూరే డిస్కుల ద్వారా ఈ సినిమా కొన్ని నెలల క్రితం రిలీజ్ కావడం మరో విశేషం. హోమ్ ఎంటర్ టైన్మెంట్ లోనూ ఎక్కువ సేల్స్ జరిగిన చిత్రంగా మైలురాళ్ళు సాధించింది.
This post was last modified on October 18, 2024 11:29 am
కొందరు దర్శకులు కమర్షియల్ ప్రపంచానికి దూరంగా తమదైన శైలిలో కొత్త జానర్లు టచ్ చేస్తూ, ఎప్పుడూ చూడని కథలను పరిచయం…
టాలీవుడ్లో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు అవకాశాలే లేని స్థితికి చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, బీజేపీకి మౌత్ పీస్గా మారనున్నారనే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా…
ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన మార్పు చేశారు. గతంలో ఉన్నట్టుగానే…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో…
అక్కినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ వలన ఒక్కసారిగా స్లో అయ్యాడు. తదుపరి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కథలపై…