థియేటర్లలో రిలీజై రెండేళ్లు దాటిపోయింది కాబట్టి ఏదో టీవీలో వచ్చినప్పుడో, యూట్యూబ్ లో క్లిప్పులు చూసినప్పుడో తప్ప ఆర్ఆర్ఆర్ ని ప్రేక్షకులు అదే పనిగా గుర్తుకు తెచ్చుకోవడం ఇప్పుడైతే లేదు. ఎన్ని రికార్డులు నమోదు చేసినా యాభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చేసిన ఈ ప్యాన్ ఇండియా గ్రాండియర్ ప్రపంచంలో ఒక చోట ఏడాదికి పైగానే ఆడుతోందంటే నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఏదో ఫ్యాన్స్ డబ్బులిచ్చి బలవంతంగా ఆడించే వ్యవహారమని కొట్టి పారేయడానికి ఆడుతోంది ఏపీ, తెలంగాణలోని మారుమూల ఊళ్ళో కాదు. అసలు టాలీవుడ్దంటే ఏంటో తెలియని జపాన్ దేశంలో.
జపాన్ లో 71 సంవత్సరాల చరిత్ర కలిగిన టుసాగుచి సాన్ సాన్ అనే థియేటర్లో ఆర్ఆర్ఆర్ 1 సంవత్సరం 9 నెలలుగా ఆడుతూనే ఉంది. రోజూ ఒకటి రెండు రెగ్యులర్ షోలతో ఏ రోజూ ఆపకుండా స్క్రీనింగ్ చేస్తూనే వచ్చారు. ఇంత సుదీర్ఘమైన రన్ తెచ్చుకున్న మొదటి ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ అక్కడ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ సుదీర్ఘమైన పరుగుకు ఇప్పుడు ముగింపు పలకబోతున్నారు. ఇదే చివరి వారంగా యాజమాన్యం ప్రకటించింది. ఇంత ఆడినా రేపు శనివారం వేస్తున్న షోకు సంబంధించిన టికెట్లు అడ్వాన్స్ గా అన్నీ అమ్ముడుపోవడం అసలు ట్విస్టు.
రాజమౌళి గ్రాండియర్ ని జపాన్ ఆడియన్స్ ఎంతగా సొంతం చేసుకున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో పట్టుమని వంద రోజులు ఆడటమే కలగా మారిన పరిస్థితిలో ఏకంగా నాన్ ఇంగ్లీష్ కంట్రీలో ఇలాంటి ఫీట్ సాధించడమంటే జక్కన్న మేజిక్ కాక మరేమిటి. ఇప్పుడు సెలవు తీసుకున్నా తిరిగి కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేస్తారని అక్కడి మీడియా టాక్. అన్నట్టు మనం ఏనాడో మర్చిపోయిన డివిడి, బ్లూరే డిస్కుల ద్వారా ఈ సినిమా కొన్ని నెలల క్రితం రిలీజ్ కావడం మరో విశేషం. హోమ్ ఎంటర్ టైన్మెంట్ లోనూ ఎక్కువ సేల్స్ జరిగిన చిత్రంగా మైలురాళ్ళు సాధించింది.
This post was last modified on October 18, 2024 11:29 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…