స్టార్ లెగసి సృష్టించి పెట్టిన తండ్రి వారసత్వాన్ని మోస్తున్న హీరోలకు దాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. బాలకృష్ణ, నాగార్జున నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ దాకా వీళ్లంతా సక్సెసయ్యారంటే దాని వెనుక ఎంతో కఠిన శ్రమ ఉంటుంది. అంచనాల బరువు మోయడం అంత సులభంగా ఉండదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అకీరానందన్ తెరంగేట్రం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. రేణు దేశాయ్ నుంచి ఎలాంటి అభ్యంతరం వచ్చే సూచనలు లేకపోవడంతో ఇంకో రెండు మూడేళ్ళలో జూనియర్ పవన్ ని స్క్రీన్ మీద చూడొచ్చని మెగాభిమానులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.
ఇక అసలు విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ పట్టుమని ముప్పై సినిమాలు చేయలేదు. చేసిన వాటిలో బ్లాక్ బస్టర్ టైటిల్స్ ని ఇతరులు ఒక్కొక్కరుగా వాడేసుకోవడం ఫ్యాన్స్ కి ఎంత మాత్రం నచ్చడం లేదు. వరుణ్ తేజ్ తొలిప్రేమ, విజయ్ దేవరకొండ ఖుషి, నితిన్ తమ్ముడులను తీసుకున్నాక తాజాగా యాంకర్ ప్రదీప్ కోసం పవర్ స్టార్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని పెట్టేసుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఇక పవన్ హిట్లలో మిగిలిన పేర్లు సుస్వాగతం, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మాత్రమే. మొదటి రెండు ఆల్రెడీ వేరే నిర్మాతలు రిజిస్టర్ చేసి పెట్టుకున్నారట.
ఇలా అయితే అకీరాకు ఇంకేం మిగలవంటూ అభిమానులు వాపోతున్నారు. చిరంజీవికీ ఈ సమస్య వచ్చింది. గ్యాంగ్ లీడర్, విజేత, దొంగ, ఖైదీ, హిట్లర్, మాస్టర్, రాక్షసుడు, ఛాలెంజ్, అభిలాష, పున్నమి నాగు ఇలా ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని టైటిల్స్ ఇతర హీరోలు తీసేసుకున్నారు. చరణ్ కొన్ని ఉంచుకోవాల్సిందన్న అభ్యర్థనను మెగా కాంపౌండ్ పట్టించుకోలేదు. అయినా కథకు తగ్గట్టు టైటిల్ పెట్టుకోవాలి తప్పించి ఊరికే రిజిస్టర్ చేసి పెట్టుకుని డబ్బులు ఖర్చు చేయలేంగా అనేది వాళ్ళ వెర్షన్. పాటలు వాడుకోకుండా ఆపగలరు కానీ టైటిల్స్ మాత్రం ఎవరి నియంత్రణలో ఉండవు.
This post was last modified on October 17, 2024 3:55 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…