ఎల్లమ్మ.. టాలీవుడ్లో చాలా రోజుల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. బలగం మూవీతో అందరినీ ఆశ్చర్యపరిచిన కమెడియన్ టర్న్డ్ డైరెక్టర్ వేణు యెల్దండి తన రెండో చిత్రంగా దీన్నే తెరకెక్కించాలనుకున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా ఈ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. బలగం తీసిన దిల్ రాజు బేనర్లోనే ఈ సినిమా చేయడానికి ఒక దశలో అంగీకారం కుదిరింది.
దిల్ రాజు స్వయంగా ఈ ప్రాజెక్టు గురించి గత ఏడాది కన్ఫమ్ చేశారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో ఈ ప్రాజెక్టు నుంచి నాని తప్పుకున్నాడు. దీంతో ఎల్లమ్మ అటకెక్కేసిందనే అంతా అనుకున్నారు. వేణుతో వీలును బట్టి సినిమా చేస్తానని నాని చెప్పాడు. కానీ నేచురల్ స్టార్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వీరి కలయికలో సినిమా వచ్చే సంకేఆలు కనిపించడం లేదు. మరి వేణు తర్వాతి ప్రాజెక్టు ఏదై ఉంటుంది.. ఎవరిత చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఎల్లమ్మ కథను వేణు పక్కన పెట్టలేదని తాజా సమాచారం. ఈ కథనే వేరే హీరోతో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు గట్టిగా వినిపిస్తున్న పేరు.. యూత్ స్టార్ నితిన్దే. దిల్ రాజుతో నితిన్కు మంచి అనుబంధం ఉంది. రాజు కెరీర్ను మలుపు తిప్పిన దిల్ మూవీని నితిన్తోనే చేశాడు. ఆ తర్వాత వీరి కలయికలో శ్రీనివాస కళ్యాణం వచ్చింది కానీ ఆడలేదు. ప్రస్తుతం రాజు బేనర్లో తమ్ముడు మూవీ చేస్తున్నాడు నితిన్.
ఇటీవలే ఎల్లమ్మ కథను నితిన్కు వేణు నరేట్ చేయగా.. అతను సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ కథ తనకు డిఫరెంటుగా ఉంటుందని నితిన్ ఫీలయ్యాడని.. కాబట్టి అతనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. మధ్యలో తేజ సజ్జకు కూడా ఈ కథను చెప్పినట్లు సమాచారం. మరి అతనేమన్నాడన్నది తెలియదు. నితిన్తో ఎల్లమ్మ ప్రాజెక్టు సెట్ కావడం ఖాయమని.. త్వరలోనే దీని గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు.
This post was last modified on October 16, 2024 12:38 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…