ఎల్లమ్మ.. టాలీవుడ్లో చాలా రోజుల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. బలగం మూవీతో అందరినీ ఆశ్చర్యపరిచిన కమెడియన్ టర్న్డ్ డైరెక్టర్ వేణు యెల్దండి తన రెండో చిత్రంగా దీన్నే తెరకెక్కించాలనుకున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా ఈ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. బలగం తీసిన దిల్ రాజు బేనర్లోనే ఈ సినిమా చేయడానికి ఒక దశలో అంగీకారం కుదిరింది.
దిల్ రాజు స్వయంగా ఈ ప్రాజెక్టు గురించి గత ఏడాది కన్ఫమ్ చేశారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో ఈ ప్రాజెక్టు నుంచి నాని తప్పుకున్నాడు. దీంతో ఎల్లమ్మ అటకెక్కేసిందనే అంతా అనుకున్నారు. వేణుతో వీలును బట్టి సినిమా చేస్తానని నాని చెప్పాడు. కానీ నేచురల్ స్టార్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వీరి కలయికలో సినిమా వచ్చే సంకేఆలు కనిపించడం లేదు. మరి వేణు తర్వాతి ప్రాజెక్టు ఏదై ఉంటుంది.. ఎవరిత చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఎల్లమ్మ కథను వేణు పక్కన పెట్టలేదని తాజా సమాచారం. ఈ కథనే వేరే హీరోతో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు గట్టిగా వినిపిస్తున్న పేరు.. యూత్ స్టార్ నితిన్దే. దిల్ రాజుతో నితిన్కు మంచి అనుబంధం ఉంది. రాజు కెరీర్ను మలుపు తిప్పిన దిల్ మూవీని నితిన్తోనే చేశాడు. ఆ తర్వాత వీరి కలయికలో శ్రీనివాస కళ్యాణం వచ్చింది కానీ ఆడలేదు. ప్రస్తుతం రాజు బేనర్లో తమ్ముడు మూవీ చేస్తున్నాడు నితిన్.
ఇటీవలే ఎల్లమ్మ కథను నితిన్కు వేణు నరేట్ చేయగా.. అతను సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ కథ తనకు డిఫరెంటుగా ఉంటుందని నితిన్ ఫీలయ్యాడని.. కాబట్టి అతనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. మధ్యలో తేజ సజ్జకు కూడా ఈ కథను చెప్పినట్లు సమాచారం. మరి అతనేమన్నాడన్నది తెలియదు. నితిన్తో ఎల్లమ్మ ప్రాజెక్టు సెట్ కావడం ఖాయమని.. త్వరలోనే దీని గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు.
This post was last modified on October 16, 2024 12:38 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి పగ్గాలు చేపట్టిన తర్వాత.. ప్రపంచ దేశాల దిగుమతులపై భారీఎత్తున సుంకాలు (టారిఫ్లు)…
అల్లుడు అదుర్స్ తర్వాత హిందీ ఛత్రపతి కోసం మూడేళ్లు టాలీవుడ్ కు దూరమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పుడు ప్రభాస్ రేంజ్…
ఏపీ వృద్ధి రేటులో దూసుకుపోతోంది. కూటమి పాలనలో గడచిన 10 నెలల్లోనే ఏపీ గణనీయ వృద్ధి రేటును సాధించింది. దేశంలోని అత్యధిక…
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాథి మరోసారి తన వివాదాస్పద నోట్బుక్ సెలబ్రేషన్తో వార్తల్లోకెక్కాడు.…
ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో ది ప్యారడైజ్, పెద్దిలు క్లాష్ కానుండటం ట్రేడ్…
పుష్ప 2 ది రూల్ తో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు రంగం…