ఎల్లమ్మ.. టాలీవుడ్లో చాలా రోజుల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. బలగం మూవీతో అందరినీ ఆశ్చర్యపరిచిన కమెడియన్ టర్న్డ్ డైరెక్టర్ వేణు యెల్దండి తన రెండో చిత్రంగా దీన్నే తెరకెక్కించాలనుకున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా ఈ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. బలగం తీసిన దిల్ రాజు బేనర్లోనే ఈ సినిమా చేయడానికి ఒక దశలో అంగీకారం కుదిరింది.
దిల్ రాజు స్వయంగా ఈ ప్రాజెక్టు గురించి గత ఏడాది కన్ఫమ్ చేశారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో ఈ ప్రాజెక్టు నుంచి నాని తప్పుకున్నాడు. దీంతో ఎల్లమ్మ అటకెక్కేసిందనే అంతా అనుకున్నారు. వేణుతో వీలును బట్టి సినిమా చేస్తానని నాని చెప్పాడు. కానీ నేచురల్ స్టార్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వీరి కలయికలో సినిమా వచ్చే సంకేఆలు కనిపించడం లేదు. మరి వేణు తర్వాతి ప్రాజెక్టు ఏదై ఉంటుంది.. ఎవరిత చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఎల్లమ్మ కథను వేణు పక్కన పెట్టలేదని తాజా సమాచారం. ఈ కథనే వేరే హీరోతో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు గట్టిగా వినిపిస్తున్న పేరు.. యూత్ స్టార్ నితిన్దే. దిల్ రాజుతో నితిన్కు మంచి అనుబంధం ఉంది. రాజు కెరీర్ను మలుపు తిప్పిన దిల్ మూవీని నితిన్తోనే చేశాడు. ఆ తర్వాత వీరి కలయికలో శ్రీనివాస కళ్యాణం వచ్చింది కానీ ఆడలేదు. ప్రస్తుతం రాజు బేనర్లో తమ్ముడు మూవీ చేస్తున్నాడు నితిన్.
ఇటీవలే ఎల్లమ్మ కథను నితిన్కు వేణు నరేట్ చేయగా.. అతను సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ కథ తనకు డిఫరెంటుగా ఉంటుందని నితిన్ ఫీలయ్యాడని.. కాబట్టి అతనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. మధ్యలో తేజ సజ్జకు కూడా ఈ కథను చెప్పినట్లు సమాచారం. మరి అతనేమన్నాడన్నది తెలియదు. నితిన్తో ఎల్లమ్మ ప్రాజెక్టు సెట్ కావడం ఖాయమని.. త్వరలోనే దీని గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు.
This post was last modified on October 16, 2024 12:38 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…