వారసులు రాజ్యమేలే ఫిలిం ఇండస్ట్రీలో సొంతంగా హీరోగా ఎదిగి ఒక స్థాయిని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనే కుర్రాడు ఇలాగే ఎంతో కష్టపడి మంచి స్థాయికి చేరుకున్నాడు. ‘ఎం.ఎస్.ధోని’ సహా పలు చిత్రాలతో గుర్తింపు సంపాదించిన అతను.. ఇంకా పెద్ద రేంజికి వెళ్తాడనుకుంటే.. నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోవడం తన అభిమానులకు పెద్ద షాక్.
తన కథ ఇలా ముగియడం కోట్ల మందిని కదిలించేసింది. ముందు సుశాంత్ మరణం విషయంలో అనుమానాలు వ్యక్తమైనా.. తర్వాత తనది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. ఐతే సుశాంత్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని ఇటీవల హీరోయిన్ ఆదాశర్మ కొన్న సంగతి తెలిసిందే. ఐతే పబ్లిసిటీ కోసమే ఆదా ఇలా చేసిందని నెటిజన్లు ఆమెను కామెంట్ చేశారు. దీనిపై ఆదా స్పందించింది.
తన గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోలేదని.. సుశాంత్ ఇల్లు తనకెంతో నచ్చిందని.. దాన్ని పూర్తిగా రీమోడలింగ్ చేయించానని ఆమె వెల్లడించింది. సుశాంత్ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉందని ఆమె వ్యాఖ్యానించింది.
“మనం జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన దేశంలో ఎవరు ఏ అభిప్రాయం అయినా వ్యక్తం చేయొచ్చు. నేను ఈ ఇంటిని కొనడంపైనా చాలామంది కామెంట్లు చేశారు. నేను మంచి వ్యక్తిని అని రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు చేయాలనిపించింది చేశా. నాకు సుశాంత్ ఇల్లు ఎంతో నచ్చింది. మా అమ్మ, అమ్మమ్మతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్నా. ఇల్లు మొత్తాన్ని రీ మోడల్ చేయించా. మొదటి అంతస్థును గుడిలా మార్చా. ఓ గదిని డ్యాన్స్ స్టూడియోగా మార్చా. టెర్రస్ మొత్తాన్ని గార్డెన్గా చేశా. నాకు ఈ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉందనిపిస్తుంది” అని ఆదా పేర్కొంది.
This post was last modified on October 16, 2024 11:24 am
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…