వారసులు రాజ్యమేలే ఫిలిం ఇండస్ట్రీలో సొంతంగా హీరోగా ఎదిగి ఒక స్థాయిని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనే కుర్రాడు ఇలాగే ఎంతో కష్టపడి మంచి స్థాయికి చేరుకున్నాడు. ‘ఎం.ఎస్.ధోని’ సహా పలు చిత్రాలతో గుర్తింపు సంపాదించిన అతను.. ఇంకా పెద్ద రేంజికి వెళ్తాడనుకుంటే.. నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోవడం తన అభిమానులకు పెద్ద షాక్.
తన కథ ఇలా ముగియడం కోట్ల మందిని కదిలించేసింది. ముందు సుశాంత్ మరణం విషయంలో అనుమానాలు వ్యక్తమైనా.. తర్వాత తనది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. ఐతే సుశాంత్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని ఇటీవల హీరోయిన్ ఆదాశర్మ కొన్న సంగతి తెలిసిందే. ఐతే పబ్లిసిటీ కోసమే ఆదా ఇలా చేసిందని నెటిజన్లు ఆమెను కామెంట్ చేశారు. దీనిపై ఆదా స్పందించింది.
తన గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోలేదని.. సుశాంత్ ఇల్లు తనకెంతో నచ్చిందని.. దాన్ని పూర్తిగా రీమోడలింగ్ చేయించానని ఆమె వెల్లడించింది. సుశాంత్ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉందని ఆమె వ్యాఖ్యానించింది.
“మనం జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన దేశంలో ఎవరు ఏ అభిప్రాయం అయినా వ్యక్తం చేయొచ్చు. నేను ఈ ఇంటిని కొనడంపైనా చాలామంది కామెంట్లు చేశారు. నేను మంచి వ్యక్తిని అని రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు చేయాలనిపించింది చేశా. నాకు సుశాంత్ ఇల్లు ఎంతో నచ్చింది. మా అమ్మ, అమ్మమ్మతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్నా. ఇల్లు మొత్తాన్ని రీ మోడల్ చేయించా. మొదటి అంతస్థును గుడిలా మార్చా. ఓ గదిని డ్యాన్స్ స్టూడియోగా మార్చా. టెర్రస్ మొత్తాన్ని గార్డెన్గా చేశా. నాకు ఈ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉందనిపిస్తుంది” అని ఆదా పేర్కొంది.
This post was last modified on October 16, 2024 11:24 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…