వారసులు రాజ్యమేలే ఫిలిం ఇండస్ట్రీలో సొంతంగా హీరోగా ఎదిగి ఒక స్థాయిని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనే కుర్రాడు ఇలాగే ఎంతో కష్టపడి మంచి స్థాయికి చేరుకున్నాడు. ‘ఎం.ఎస్.ధోని’ సహా పలు చిత్రాలతో గుర్తింపు సంపాదించిన అతను.. ఇంకా పెద్ద రేంజికి వెళ్తాడనుకుంటే.. నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోవడం తన అభిమానులకు పెద్ద షాక్.
తన కథ ఇలా ముగియడం కోట్ల మందిని కదిలించేసింది. ముందు సుశాంత్ మరణం విషయంలో అనుమానాలు వ్యక్తమైనా.. తర్వాత తనది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. ఐతే సుశాంత్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని ఇటీవల హీరోయిన్ ఆదాశర్మ కొన్న సంగతి తెలిసిందే. ఐతే పబ్లిసిటీ కోసమే ఆదా ఇలా చేసిందని నెటిజన్లు ఆమెను కామెంట్ చేశారు. దీనిపై ఆదా స్పందించింది.
తన గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోలేదని.. సుశాంత్ ఇల్లు తనకెంతో నచ్చిందని.. దాన్ని పూర్తిగా రీమోడలింగ్ చేయించానని ఆమె వెల్లడించింది. సుశాంత్ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉందని ఆమె వ్యాఖ్యానించింది.
“మనం జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన దేశంలో ఎవరు ఏ అభిప్రాయం అయినా వ్యక్తం చేయొచ్చు. నేను ఈ ఇంటిని కొనడంపైనా చాలామంది కామెంట్లు చేశారు. నేను మంచి వ్యక్తిని అని రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు చేయాలనిపించింది చేశా. నాకు సుశాంత్ ఇల్లు ఎంతో నచ్చింది. మా అమ్మ, అమ్మమ్మతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్నా. ఇల్లు మొత్తాన్ని రీ మోడల్ చేయించా. మొదటి అంతస్థును గుడిలా మార్చా. ఓ గదిని డ్యాన్స్ స్టూడియోగా మార్చా. టెర్రస్ మొత్తాన్ని గార్డెన్గా చేశా. నాకు ఈ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉందనిపిస్తుంది” అని ఆదా పేర్కొంది.
This post was last modified on October 16, 2024 11:24 am
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…