వారసులు రాజ్యమేలే ఫిలిం ఇండస్ట్రీలో సొంతంగా హీరోగా ఎదిగి ఒక స్థాయిని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనే కుర్రాడు ఇలాగే ఎంతో కష్టపడి మంచి స్థాయికి చేరుకున్నాడు. ‘ఎం.ఎస్.ధోని’ సహా పలు చిత్రాలతో గుర్తింపు సంపాదించిన అతను.. ఇంకా పెద్ద రేంజికి వెళ్తాడనుకుంటే.. నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోవడం తన అభిమానులకు పెద్ద షాక్.
తన కథ ఇలా ముగియడం కోట్ల మందిని కదిలించేసింది. ముందు సుశాంత్ మరణం విషయంలో అనుమానాలు వ్యక్తమైనా.. తర్వాత తనది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. ఐతే సుశాంత్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని ఇటీవల హీరోయిన్ ఆదాశర్మ కొన్న సంగతి తెలిసిందే. ఐతే పబ్లిసిటీ కోసమే ఆదా ఇలా చేసిందని నెటిజన్లు ఆమెను కామెంట్ చేశారు. దీనిపై ఆదా స్పందించింది.
తన గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోలేదని.. సుశాంత్ ఇల్లు తనకెంతో నచ్చిందని.. దాన్ని పూర్తిగా రీమోడలింగ్ చేయించానని ఆమె వెల్లడించింది. సుశాంత్ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉందని ఆమె వ్యాఖ్యానించింది.
“మనం జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన దేశంలో ఎవరు ఏ అభిప్రాయం అయినా వ్యక్తం చేయొచ్చు. నేను ఈ ఇంటిని కొనడంపైనా చాలామంది కామెంట్లు చేశారు. నేను మంచి వ్యక్తిని అని రుజువు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు చేయాలనిపించింది చేశా. నాకు సుశాంత్ ఇల్లు ఎంతో నచ్చింది. మా అమ్మ, అమ్మమ్మతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్నా. ఇల్లు మొత్తాన్ని రీ మోడల్ చేయించా. మొదటి అంతస్థును గుడిలా మార్చా. ఓ గదిని డ్యాన్స్ స్టూడియోగా మార్చా. టెర్రస్ మొత్తాన్ని గార్డెన్గా చేశా. నాకు ఈ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉందనిపిస్తుంది” అని ఆదా పేర్కొంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…