నో డౌట్‌.. యువ‌గ‌ళం తో చాలా నోళ్లు మూయించాలి

ఔను! టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో అనేక లాభాలు ఆశిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా గ‌తంలో వైసీపీ నాయ‌కులు వ్య‌క్తిగ‌తంగా లోకేష్‌పై వేసిన ప‌ప్పు అనే ముద్ర‌ను తుడిచేసుకోవ‌డం క‌నిపిస్తోంది. లోకేష్‌కు మాట్లాడ‌డ‌మే చేత‌కాదు.. అని మంత్రులు రోజా.. వంటివారు బ‌హిరంగంగానే విమ‌ర్శించేవారు. మంగ‌ళ‌గిరికి, మంద‌ల‌గిరికి తేడా తెలీదు అని ఎద్దేవా చేసేవారు.

ఇక‌, వ‌ర్ధంతికి, జ‌యంతికి కూడా తేడా తెలియ‌ద‌ని కామెంట్లు చేసేవారు. ఇక‌, ప్ర‌జాద‌ర‌ణ లేద‌ని నాయ‌కు డిగాకూడా నారా లోకేష్‌పై ముద్ర ఉంది. ఇటీవ‌ల మంత్రి నారాయ‌ణ స్వామి కూడా.. నారా లోకేష్ అంటే.. కేవ‌లం చంద్ర‌బాబు కొడుకుగా మాత్ర‌మే తాము చూస్తామ‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేం దుకు నారా లోకేష్ యువ‌గ‌ళాన్ని వినియోగించుకుంటున్నార‌ని సుస్ప‌ష్టం.

ఈ పాద‌యాత్ర ద్వారా.. మ‌రో రెండు ప్ర‌ధాన ల‌క్ష్యాలు సాధించాల‌ని పార్టీ నిర్ణయించుకున్న‌ట్టు తెలుస్తోం ది. వాటిలో ఒక‌టి.. త‌న‌ను తాను నాయ‌కుడిగా ఆవిష్క‌రించుకోవ‌డం. త‌ద్వారా.. పార్టీకి కాబోయే అధినేత గా ప్ర‌చారం క‌ల్పించుకోవ‌డ‌మే కాకుండా.. ప్ర‌జామోదం పొందడం కూడా ఈ యాత్ర వెనుక కీల‌క‌మైన విష‌యంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు టీడీపీ అంటేచంద్ర‌బాబు మిన‌హా మ‌రొక‌రు మ‌న‌కు క‌నిపించ‌డం లేదు.

దీనివ‌ల్ల రేపు పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. దీనిని గ‌మ‌నించిన నారా లోకేష్‌… చంద్ర‌బాబు కూడా యువ‌గ‌ళం ద్వారా.. టీడీపీకి కాబోయే అధ్య‌క్షుడిగా నారా లోకేష్‌కు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది కూడా తెలుస్తోంది అదేస‌మ‌యంలో రాష్ట్రానికి యువ నేత దిక్సూచిగా మార‌నున్నార‌ని.. కూడా టీడీపీ నాయ‌కులు అంటున్నారు. అంటే.. మొత్తంగా యువ‌గ‌ళం ద్వారా.. ఇటు వ్య‌క్తిగ‌తంగా అటు పార్టీ ప‌రంగా.. మ‌రోవైపు.. రాష్ట్రం ప‌రంగా కూడా కొన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి చేరాల‌నేది ల‌క్ష్యంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.