Uncategorized

బిగ్‍బాస్‍ పోల్స్ లో ఆమెకి సడన్‍ ఫాలోయింగ్‍

బిగ్‍బాస్‍ రియాలిటీ షోలో పాల్గొనే వాళ్లు ముందుగా గుర్తు పెట్టుకోవాల్సినది… ఏ హౌస్‍మేట్‍ని తక్కువ చేయకూడదని. బయట ఎవరు ఎంత గొప్పవాళ్లయినా కావచ్చు కానీ హౌస్‍లోకి వెళ్లిన తర్వాత అందరూ సమానమే. అందుకే బిగ్‍బాస్‍ హౌస్‍లో ఎవరికీ ప్రత్యేక మర్యాదలుండవు. అందరూ వంట చేయాలి, అందరూ బాత్రూమ్‍లు కడగాలి, అందరికీ ఒకే తరహా మంచాలు, కంచాలుంటాయి. అయితే వివిధ బ్యాక్‍గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్లను, లేదా అంతగా పాపులర్‍ కాని వాళ్లను కాస్త పేరున్న వాళ్లు అణచి వేయాలని చూస్తుంటారు.

తమకు ఫాన్స్ వున్నారు కనుక తమ స్థానానికి ఎలాంటి సమస్య వుండదని అనేసుకుంటారు. కానీ అంతిమంగా విజేతలవ్వాలంటే మాత్రం షో ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుని తీరాలి. అందుకే కౌషల్‍ అయినా, రాహుల్‍ అయినా విజేతలయ్యారు. ఈ సీజన్లో హౌస్‍మేట్స్ అస్సలు లెక్క చేయని ఇద్దరు కంటెస్టెంట్లు కుమార్‍ సాయి, అరియానా గ్లోరీ. కమెడియన్‍ కుమార్‍ సాయి అయినా నిజంగానే బద్ధకంగా వుంటున్నాడు కానీ అరియానా మాత్రం తనవంతుగా పూర్తి ఎఫర్టస్ పెడుతోంది. అయితే ఆమెను అభిజీత్‍, హారిక, సోహైల్‍ లాంటి కొందరు చిన్నచూపు చూస్తున్నారు. ఆమె ఏమి మాట్లాడినా, ఆటలో ఎలాంటి సలహాలిచ్చినా తీసి పారేస్తున్నారు.

అయితే అరియానా దాని గురించి ఎక్కడా రచ్చ చేయడం లేదు. తన వాదన వినిపిస్తోందే కానీ తనను ఇల్‍ట్రీట్‍ చేస్తున్నారని డ్రామా కూడా చేయడం లేదు. ఇదంతా ప్రేక్షకులు గమనిస్తున్నారు కనుక ఆమెకు సడన్‍గా గ్రాఫ్‍ రైజ్‍ అయింది. ఈ వారం ఎలిమినేట్‍ అయిపోతుందేమో అనుకున్నారు కానీ ఆమెకు ఫాలోయింగ్‍ పెరిగింది. ప్రేక్షకుల నుంచి భారీగానే ఓట్లు పడుతున్నాయి. ఆమె పట్ల హౌస్‍మేట్స్ ప్రవర్తిస్తోన్న తీరుని నాగార్జున ప్రశ్నించినట్టయితే, వాళ్లు తమ తప్పుని గ్రహించినట్టయితే ఓకే కానీ లేదంటే అరియానా కూడా ప్రేక్షకుల సపోర్ట్ తో టైటిల్‍ కంటెండర్‍ అయిపోతుంది.

This post was last modified on September 27, 2020 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

43 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

5 hours ago