మార్పులు సహజం. అవి సాధారణ వ్యక్తులకైనా.. రాజకీయ నేతలకైనా! అవసరానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటేనే.. రాజకీయాల్లో నేతలకు లైఫ్ ఉంటుంది. పార్టీకి ప్రజల్లో బలం ఉంటుంది. లేకపోతే.. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా వ్యవహారం మారిపోతుంది.
ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పార్టీ ప్రభావం తగ్గుముఖం పట్టింది. అధికార పార్టీ దూకుడుతో .. నాయకులు జంప్ చేయడం, లేదా.. మౌనం పాటించడం వల్ల టీడీపీ తరపున గళం వినిపించే నాయకులు కరువయ్యారు.
దీంతో కీలకమైన జిల్లాల్లో పార్టీ మోసేవారు.. ప్రభుత్వాన్ని దులిపేసేవారు కూడా కనిపించడం లేదు. ఈ పరిణామాలతో అలెర్ట్ అయిన చంద్రబాబు తాజాగా అత్యంత కీలకమైన విశాఖ జిల్లాపై దృష్టి పెట్టారు. ఇక్కడి యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఇటీవల పార్టీ మారి.. జగన్ చెంతకు చేరిపోయారు. అదే సమయంలో విశాఖ పార్టీ ఇంచార్జ్ రెహమాన్ కూడా సైకిల్ దిగేశారు.
నాలుగు నియోజకవర్గాలను టీడీపీ తన ఖాతాలో వేసుకున్నా.. ఒక్క వెలగపూడి రామకృష్ణబాబు తప్ప.. ఎవరూ మాట్లాడడం లేదు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి.. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. బెల్లం కొట్టిన రాయల్లే మారిపోయారనేది బాబుకు మరింత ఇబ్బందికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఇంకా ఉపేక్షిస్తే.. పార్టీ పరువు మరింత దిగజారుతుందని భావించిన చంద్రబాబు.. పక్కన పెడతామనుకున్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకు ప్రాధాన్యం పెంచుతున్నారు. నిజానికి గత ఎన్నికల్లో ఆయన ఓటమి తర్వాత.. బాబు ఆయనను పక్కన పెట్టారు. స్వపక్షంలోనే విపక్షంగా మారడంతో బాబు ఆయనను పట్టించుకోలేదు. కానీ, ఇటీవల మారిన పరిణామాలతో.. ఆయనకు ప్రాధానం పెంచుతున్నారు. దీంతో అయ్యన్న దూకుడు పెంచారు.
ఇక, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు కూడా చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యేల్లో ఆయన ఒక్కరే ఉండడంతో గతంలో ఆయనను పట్టించుకోకపోయినా.. ఇప్పుడు మాత్రం వెలగపూడికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. దీంతో జిల్లాలో పార్టీ దిగజారకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి వీరు ఏమేరకు పార్టీని కాపాడతారో చూడాలి.
This post was last modified on September 23, 2020 7:45 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…