గత ఆరు నెలల్లో వివిధ భాషల నుంచి అనేక కొత్త సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. అందులో అమితాబ్ బచ్చన్ నటించిన ‘గులాబో సితాబో’ ఉంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’ ఉంది. తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన ‘పొన్మగల్ వందాల్’ ఉంది.
మలయాళంలో ఫాహద్ ఫాజిల్ చిత్రం ‘సీ యూ సూన్’ కూడా ఇలాగే విడుదలైంది. తెలుగులోకి వచ్చేసరికి నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’తో పాటుగా కొన్ని చిన్న చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజయ్యాయి. ఐతే ఈ మొత్తం చిత్రాల వరస చూస్తే.. దాదాపుగా అన్నీ క్లాస్గానే కనిపిస్తాయి.
మల్టీప్లెక్స్ ఆడియన్స్ను టార్గెట్ చిత్రాలే ఓటీటీలో విడుదలవుతూ వచ్చాయి. ఈ ఫ్లాట్ ఫామ్లో పూర్తి స్థాయి మాస్ సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. ఆ లోటును తీర్చే సినిమా అవుతుందని ‘లక్ష్మీబాంబ్’ మీద ఆశలు పెట్టుకున్నారు.
అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ రూపొందించిన చిత్రం ‘లక్ష్మీబాంబ్’. ఇది సౌత్ ఇండియన్ బ్లాక్బస్టర్ హార్రర్ కామెడీ ‘కాంఛన’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దాదాపు రూ.90 కోట్లకు హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి.
ఇప్పటికే దిల్ బేచారా సహా కొన్ని పెద్ద సినిమాలను రిలీజ్ చేసిన హాట్ స్టార్.. ‘లక్ష్మీబాంబు’ విషయంలో మాత్రం ఆలస్యం చేస్తోంది. ఊరిస్తూ వస్తోంది. ఐతే మంచి సందర్భం చూసి ‘లక్ష్మీబాంబ్’ను రిలీజ్ చేయాలన్నది ఆ సంస్థ ఉద్దేశం. అందుకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.
‘లక్ష్మీ బాంబ్’ను పేల్చడానికి దీపావళి కంటే మంచి సందర్భం మరొకటి ఉండదన్నది ఆ సంస్థ ఉద్దేశం. నవంబరు 14న దీపావళి కాగా.. ముందు రోజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా కొంత టాకీ పార్ట్ మిగిలుందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయట. ప్రస్తుతం ‘బెల్ బాటమ్’ కోసం యూరప్లో ఉన్న అక్షయ్.. త్వరలోనే స్వదేశానికి వచ్చి ‘లక్ష్మీబాంబ్’ పని పూర్తి చేస్తాడట.
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…