ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టులో కౌంటరు దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అమరావతిపై విచారణలో ఉన్న 75 వ్యాజ్యాల విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు అన్ని రాజకీయ పార్టీలకు కౌంటరు దాఖలు చేసే అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కౌంటరు దాఖలు చేయాలని ఈరోజు జనసేన అధ్యక్షుడు … పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో నిర్ణయించారు. అనంతరం కౌంటరు దాఖలు చేస్తున్నట్లు మీడియాకు ప్రకటించారు.
వైసీపీ, టీడీపీలు తమ ఆధిపత్య ధోరణికి అమరావతిని బలిచేస్తున్నాయని అన్నారు. ఒక కొత్త రాజధాని నిర్మించుకునే అవకాశాన్ని, విలువైన సమయాన్ని ఈ పార్టీలు వృథా చేస్తున్నాయని జనసేన నాయకత్వం అభిప్రాయపడింది. కౌంటరును బలంగా దాఖలు చేస్తామని పేర్కొంది. అమరావతియే రాజధానిగా కొనసాగాలని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా స్పష్టంగా పేర్కొనక పోయినా “ఇప్పటికే కేంద్రం 2500 కోట్లు ఇచ్చింది, రాష్ట్రం 6500 కోట్లు ఇచ్చింది. మొత్తం 9 వేల కోట్లు అమరావతిలో ఖర్చుపెట్టారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజా ధనం వృథా అవడాన్ని జనసేన సహించదు, అమరావతిలో చక్కటి జలవనరుల లభ్యత ఉంది” అని చెప్పడం ద్వారా అమరావతిలో రాజధాని కొనసాగాలన్న అభిప్రాయాన్ని జనసేన కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. కౌంటరు దాఖలు చేసేటపుడు కూడా ఈ విషయాన్నే తెలపనున్నారు.
ప్రభుత్వాన్ని విశ్వసించి తమ 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన 28 వేల మంది రైతులకు అన్యాయం జరగడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ స్పష్టంగా పేర్కొన్నారు. వారి వైపు తుదివరకు నిలబడతాం. మనకు పర్యావరణహితమైన రాజధాని అవసరం ఉంది అని పవన్ పేర్కొన్నారు.
This post was last modified on August 30, 2020 9:45 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…