Uncategorized

రాజధానిపై కౌంటరు దాఖలుకు జనసేన నిర్ణయం

ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టులో కౌంటరు దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అమరావతిపై విచారణలో ఉన్న 75 వ్యాజ్యాల విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు అన్ని రాజకీయ పార్టీలకు కౌంటరు దాఖలు చేసే అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కౌంటరు దాఖలు చేయాలని ఈరోజు జనసేన అధ్యక్షుడు … పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో నిర్ణయించారు. అనంతరం కౌంటరు దాఖలు చేస్తున్నట్లు మీడియాకు ప్రకటించారు.

వైసీపీ, టీడీపీలు తమ ఆధిపత్య ధోరణికి అమరావతిని బలిచేస్తున్నాయని అన్నారు. ఒక కొత్త రాజధాని నిర్మించుకునే అవకాశాన్ని, విలువైన సమయాన్ని ఈ పార్టీలు వృథా చేస్తున్నాయని జనసేన నాయకత్వం అభిప్రాయపడింది. కౌంటరును బలంగా దాఖలు చేస్తామని పేర్కొంది. అమరావతియే రాజధానిగా కొనసాగాలని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా స్పష్టంగా పేర్కొనక పోయినా “ఇప్పటికే కేంద్రం 2500 కోట్లు ఇచ్చింది, రాష్ట్రం 6500 కోట్లు ఇచ్చింది. మొత్తం 9 వేల కోట్లు అమరావతిలో ఖర్చుపెట్టారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజా ధనం వృథా అవడాన్ని జనసేన సహించదు, అమరావతిలో చక్కటి జలవనరుల లభ్యత ఉంది” అని చెప్పడం ద్వారా అమరావతిలో రాజధాని కొనసాగాలన్న అభిప్రాయాన్ని జనసేన కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. కౌంటరు దాఖలు చేసేటపుడు కూడా ఈ విషయాన్నే తెలపనున్నారు.

ప్రభుత్వాన్ని విశ్వసించి తమ 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన 28 వేల మంది రైతులకు అన్యాయం జరగడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ స్పష్టంగా పేర్కొన్నారు. వారి వైపు తుదివరకు నిలబడతాం. మనకు పర్యావరణహితమైన రాజధాని అవసరం ఉంది అని పవన్ పేర్కొన్నారు.

This post was last modified on August 30, 2020 9:45 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

1 hour ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

2 hours ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

7 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

8 hours ago

ఇళయరాజాకు ఇది తగునా?

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…

9 hours ago

నా రెండో సంత‌కం ఆ ఫైలు పైనే: చంద్ర‌బాబు

కూట‌మి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంత‌కం.. మెగా డీఎస్సీపైనేన‌ని.. దీనివ‌ల్ల 20 వేల మంది నిరుద్యోగుల‌కు మేలు…

9 hours ago