Uncategorized

వైరల్ వీడియో.. మాస్కు పెట్టుకోమన్న పాపానికి

ఈ మధ్యే ఓ హైదరాబాదీ పైలట్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న తన భార్యను ఇంట్లో గొడ్డును బాదినట్లు బాదుతున్న వీడియో ఒకటి ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ వ్యక్తి శాడిజానికి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నాక వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ తాలూకు వీడియో అది.

ఇప్పుడు ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఓ మహిళను అందులోనే పని చేసే ఓ వ్యక్తి దారుణంగా కొట్టడం.. దానికి సంబంధించిన వీడియో బయటికి రావడం సంచలనం రేపుతోంది. ఇది ఆంధ్ర్రపదేశ్‌లోని నెల్లూరు నగరంలో ఓ ప్రభుత్వ ఆఫీసులో జరిగింది. ఆ వ్యక్తి మాస్కు పెట్టుకోకుండా ఆఫీసుకు వస్తుండటం పట్ల ఆ మహిళ ప్రశ్నించిందని.. దీంతో అతడికి కోపం వచ్చి ఆమెపై దాడి చేశాడని అంటున్నారు. నేరుగా ఆఫీసులోకి వచ్చి ఆమె మీద అతను విరుచుకుపడ్డాడు.

పక్కనే రాడ్ లాంటిది కనిపిస్తే దాన్ని తీసుకుని ఆమెపై దాడి చేశాడు. తోటి సిబ్బంది వచ్చి విడిపించే ప్రయత్నం చేసినా ఆమెను కొడుతూనే ఉన్నాడు. మహిళ అని చూడకుండా మరీ విచక్షణా రహితంగా కొట్టడం దారుణం. ఆ మహిళ వికలాంగురాలని అంటున్నారు. ఇదే నిజమైతే అది మరీ అన్యాయం.

ఈ వీడియో ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో పెట్టి ఏపీ ప్రభుత్వ అధికారులు, పోలీసులను ట్యాగ్ చేశారు నెటిజన్లు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ఈ వీడియో చూసి స్పందించారు. ఈ ఉదంతం దారుణమని.. దాడి చేసిన ఆ వ్యక్తిని వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని.. అతడిపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి దర్యాప్తు చేస్తారని.. బాధితురాలికి న్యాయం జరుగుతుందని.. ఇలాంటి వాటిని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని పేర్కొన్నారు.

This post was last modified on July 1, 2020 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

35 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

42 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago