Uncategorized

వైరల్ వీడియో.. మాస్కు పెట్టుకోమన్న పాపానికి

ఈ మధ్యే ఓ హైదరాబాదీ పైలట్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న తన భార్యను ఇంట్లో గొడ్డును బాదినట్లు బాదుతున్న వీడియో ఒకటి ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ వ్యక్తి శాడిజానికి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నాక వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ తాలూకు వీడియో అది.

ఇప్పుడు ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఓ మహిళను అందులోనే పని చేసే ఓ వ్యక్తి దారుణంగా కొట్టడం.. దానికి సంబంధించిన వీడియో బయటికి రావడం సంచలనం రేపుతోంది. ఇది ఆంధ్ర్రపదేశ్‌లోని నెల్లూరు నగరంలో ఓ ప్రభుత్వ ఆఫీసులో జరిగింది. ఆ వ్యక్తి మాస్కు పెట్టుకోకుండా ఆఫీసుకు వస్తుండటం పట్ల ఆ మహిళ ప్రశ్నించిందని.. దీంతో అతడికి కోపం వచ్చి ఆమెపై దాడి చేశాడని అంటున్నారు. నేరుగా ఆఫీసులోకి వచ్చి ఆమె మీద అతను విరుచుకుపడ్డాడు.

పక్కనే రాడ్ లాంటిది కనిపిస్తే దాన్ని తీసుకుని ఆమెపై దాడి చేశాడు. తోటి సిబ్బంది వచ్చి విడిపించే ప్రయత్నం చేసినా ఆమెను కొడుతూనే ఉన్నాడు. మహిళ అని చూడకుండా మరీ విచక్షణా రహితంగా కొట్టడం దారుణం. ఆ మహిళ వికలాంగురాలని అంటున్నారు. ఇదే నిజమైతే అది మరీ అన్యాయం.

ఈ వీడియో ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో పెట్టి ఏపీ ప్రభుత్వ అధికారులు, పోలీసులను ట్యాగ్ చేశారు నెటిజన్లు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ఈ వీడియో చూసి స్పందించారు. ఈ ఉదంతం దారుణమని.. దాడి చేసిన ఆ వ్యక్తిని వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని.. అతడిపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి దర్యాప్తు చేస్తారని.. బాధితురాలికి న్యాయం జరుగుతుందని.. ఇలాంటి వాటిని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని పేర్కొన్నారు.

This post was last modified on July 1, 2020 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

49 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

5 hours ago