Uncategorized

వైరల్ వీడియో.. మాస్కు పెట్టుకోమన్న పాపానికి

ఈ మధ్యే ఓ హైదరాబాదీ పైలట్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న తన భార్యను ఇంట్లో గొడ్డును బాదినట్లు బాదుతున్న వీడియో ఒకటి ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ వ్యక్తి శాడిజానికి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నాక వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ తాలూకు వీడియో అది.

ఇప్పుడు ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఓ మహిళను అందులోనే పని చేసే ఓ వ్యక్తి దారుణంగా కొట్టడం.. దానికి సంబంధించిన వీడియో బయటికి రావడం సంచలనం రేపుతోంది. ఇది ఆంధ్ర్రపదేశ్‌లోని నెల్లూరు నగరంలో ఓ ప్రభుత్వ ఆఫీసులో జరిగింది. ఆ వ్యక్తి మాస్కు పెట్టుకోకుండా ఆఫీసుకు వస్తుండటం పట్ల ఆ మహిళ ప్రశ్నించిందని.. దీంతో అతడికి కోపం వచ్చి ఆమెపై దాడి చేశాడని అంటున్నారు. నేరుగా ఆఫీసులోకి వచ్చి ఆమె మీద అతను విరుచుకుపడ్డాడు.

పక్కనే రాడ్ లాంటిది కనిపిస్తే దాన్ని తీసుకుని ఆమెపై దాడి చేశాడు. తోటి సిబ్బంది వచ్చి విడిపించే ప్రయత్నం చేసినా ఆమెను కొడుతూనే ఉన్నాడు. మహిళ అని చూడకుండా మరీ విచక్షణా రహితంగా కొట్టడం దారుణం. ఆ మహిళ వికలాంగురాలని అంటున్నారు. ఇదే నిజమైతే అది మరీ అన్యాయం.

ఈ వీడియో ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో పెట్టి ఏపీ ప్రభుత్వ అధికారులు, పోలీసులను ట్యాగ్ చేశారు నెటిజన్లు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ఈ వీడియో చూసి స్పందించారు. ఈ ఉదంతం దారుణమని.. దాడి చేసిన ఆ వ్యక్తిని వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని.. అతడిపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి దర్యాప్తు చేస్తారని.. బాధితురాలికి న్యాయం జరుగుతుందని.. ఇలాంటి వాటిని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని పేర్కొన్నారు.

This post was last modified on July 1, 2020 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

1 hour ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago