ఈ మధ్యే ఓ హైదరాబాదీ పైలట్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న తన భార్యను ఇంట్లో గొడ్డును బాదినట్లు బాదుతున్న వీడియో ఒకటి ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ వ్యక్తి శాడిజానికి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నాక వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ తాలూకు వీడియో అది.
ఇప్పుడు ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఓ మహిళను అందులోనే పని చేసే ఓ వ్యక్తి దారుణంగా కొట్టడం.. దానికి సంబంధించిన వీడియో బయటికి రావడం సంచలనం రేపుతోంది. ఇది ఆంధ్ర్రపదేశ్లోని నెల్లూరు నగరంలో ఓ ప్రభుత్వ ఆఫీసులో జరిగింది. ఆ వ్యక్తి మాస్కు పెట్టుకోకుండా ఆఫీసుకు వస్తుండటం పట్ల ఆ మహిళ ప్రశ్నించిందని.. దీంతో అతడికి కోపం వచ్చి ఆమెపై దాడి చేశాడని అంటున్నారు. నేరుగా ఆఫీసులోకి వచ్చి ఆమె మీద అతను విరుచుకుపడ్డాడు.
పక్కనే రాడ్ లాంటిది కనిపిస్తే దాన్ని తీసుకుని ఆమెపై దాడి చేశాడు. తోటి సిబ్బంది వచ్చి విడిపించే ప్రయత్నం చేసినా ఆమెను కొడుతూనే ఉన్నాడు. మహిళ అని చూడకుండా మరీ విచక్షణా రహితంగా కొట్టడం దారుణం. ఆ మహిళ వికలాంగురాలని అంటున్నారు. ఇదే నిజమైతే అది మరీ అన్యాయం.
ఈ వీడియో ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో పెట్టి ఏపీ ప్రభుత్వ అధికారులు, పోలీసులను ట్యాగ్ చేశారు నెటిజన్లు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ఈ వీడియో చూసి స్పందించారు. ఈ ఉదంతం దారుణమని.. దాడి చేసిన ఆ వ్యక్తిని వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని.. అతడిపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి దర్యాప్తు చేస్తారని.. బాధితురాలికి న్యాయం జరుగుతుందని.. ఇలాంటి వాటిని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని పేర్కొన్నారు.
This post was last modified on July 1, 2020 10:51 am
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…