ఆప్ గెలిస్తే మూడంశాలే కీలకమవుతాయా ?

ఆదివారం జరగబోయే పోలింగ్ లో తమ గెలుపు తథ్యమని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అటు కాంగ్రెస్ చాలా ధీమాగా ఉన్నాయి. ఒకేదశలో 117 సీట్లకు  జరగబోయే పోలింగ్ లో రెండుపార్టీలు కూడా తమకు ప్లస్సులుగా ఉన్న అంశాలను బాగా హైలైట్ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీయే కాబట్టి జనాల్లోకి బాగా చొచ్చుకుపోతోంది. ఇదే సమయంలో ఆప్ కూడా జనాధరణ తమకు బ్రహ్మాండంగా ఉందంటు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది.

సరే కాంగ్రెస్ ను పక్కన పెట్టేస్తే ఆప్ ప్రధానంగా మూడు అంశాల మీదే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. అవేమిటంటే మొదటిదేమో ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కున్న క్లీన్ ఇమేజి. మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ పైన ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. మొదట్లో కాస్త దూకుడు మనిషి అనే ముద్రుండేది. అయితే గడచిన ఐదేళ్ళుగా బాగా ఆరితేరిపోయినట్లున్నారు. అందుకనే ప్రశాంతంగా తన దృష్టి మొత్తాన్ని పరిపాలనపైనే పెట్టారు.

ఇక రెండో అంశం ఏమిటంటే అందరికీ ఉచిత విద్యా పథకం. ఢిల్లీలోని అన్నీ స్కూళ్ళు, కాలేజీల్లో అర్హులందరికీ ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తోంది. విద్యాసంస్ధలకు పక్కా భవనాలు, నిరంతరం విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, టీచర్ల నియామకంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా వ్యవస్ధ కూడా బాగా బలోపేతమైంది. అంతకుముందు ప్రభుత్వాలు విద్యారంగంపై ఇంతగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవనే చెప్పాలి. అందుకనే ఢిల్లీ విద్యా వ్యవస్ధ భేష్ అనిపించుకుంటోంది.

ఇక మూడో పాయింట్ ఏమిటంటే అందరికీ ఉచిత వైద్యం. ఢిల్లీలోని వాడ వాడలా, మధ్య తరగతి, పేదలుండే కాలనీల్లో, మురికివాడల్లో కూడా చౌమల్లా క్లినిక్సని కేజ్రీవాల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో అవసరమైన డాక్టర్లు, ఇతర స్టాఫ్ ను నియమించారు. అత్యాధునికమైన టెస్టింగ్ కిట్స్ ను అందుబాటులో ఉంచింది. దాదాపు 25 రకాల పరీక్షలను ఉచితంగా చేయటమే కాక మందులు కూడా ఉచితంగానే ఇస్తోంది. చౌమల్లా క్లినిక్కులు బాగా ప్రజాధరణ పొందాయి.

ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధుల విషయంలో ఈ క్లినిక్కులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అవసరమైతే ఇళ్ళకే వెళ్ళి వైద్య సేవలు అందిస్తున్నాయి. అందుకనే దీనికి ఇంత ఆదరణ పెరిగిపోయింది. అందుకనే వీటిని మోడల్ గా చూపించి పంజాబ్ లో కూడా ఒక్క అవకాశం ఇవ్వమని ఓటర్లను కేజ్రీవాల్ అడుగుతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on February 20, 2022 3:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

24 minutes ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

1 hour ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

2 hours ago

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

4 hours ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

4 hours ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

5 hours ago