అందం, అభినయం రెండూ ఉండి.. కాస్త స్టార్ ఇమేజ్ కూడా ఉన్న హీరోయిన్లకు ఇప్పుడు మామూలు డిమాండ్ లేదు. ఇలాంటి హీరోయిన్ల కొరత అన్ని ఇండస్ట్రీలనూ వేధిస్తోంది. టాలీవుడ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్ల ముందు వరకు కాజల్, సమంత, తమన్నా, అనుష్క.. ఇలా మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండేది. కానీ వాళ్లందరికీ కాస్త వయసు పెరిగి, జోరు తగ్గిపోయి టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఏర్పడింది.
ఇప్పుడు ఈ స్థాయి హీరోయిన్లు పూజా హెగ్డే, రష్మిక మందన్నా మాత్రమే. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు అన్ని రకాల ఆకర్షణలూ ఉండి, ఎక్కువ డిమాండ్ ఉన్నది పూజాకు మాత్రమే అని చెప్పాలి. రష్మికకు కూడా కొన్ని మైనస్లున్నాయి. ఈ నేపథ్యంలో సరైన హీరయిన్ టాలీవుడ్లోకి అడుగు పెడితే అవకాశాలకు లోటే ఉండదు. బాలీవుడ్ భామ కియారాకు ఇక్కడ మంచి డిమాండ్ ఉన్నా కూడా.. ఆమె సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటోంది.ఇలాంటి పరిస్థితుల్లోనే శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది.
ఆమెను టాలీవుడ్కు రప్పించడానికి చాన్నాళ్ల ముందు నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ సరసన పూరి జగన్నాథ్ తెరకెక్కించబోయే కొత్త చిత్రంలో ఆమె కథానాయికగా నటించనున్నట్లు వార్త బయటికి వచ్చింది. నిజంగా ఈ సినిమా ఓకే అయినట్లయితే.. టాలీవుడ్లో అవకాశాల వెల్లువకు జాన్వి గేట్లు తెరిచినట్లే.
అరంగేట్రానికి ముందే ఆమెకు డిమాండ్ ఉండగా.. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టుతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆమె కోసం వేరే నిర్మాతలు కూడా టచ్లోకి వెళ్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించబోయే సినిమాకు జాన్విని అడుగుతున్నారట. ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి టైం పడుతుంది కానీ.. ముందే జాన్వి నుంచి కమిట్మెంట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోందట. తారక్ సరసన కూడా జాన్వి ఓకే అయిందటే.. మిగతా స్టార్లను కూడా జాన్వి ఒక రౌండ్ వేసేయడం లాంఛనమే అనుకోవచ్చు.
This post was last modified on January 27, 2022 8:11 pm
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…
మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజధాని పనులకు పునః ప్రారంభం కూడా…
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగే సంపాదించాడు శ్రీ విష్ణు. గత ఏడాది అతడి నుంచి…