Uncategorized

మొన్న మోహన్ బాబు.. ఇప్పుడు నాగ్

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల వ్యవహారంపై టాలీవుడ్ హీరోల్లో వైఖరేంటో అర్థం కాక ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సమస్య ఇండస్ట్రీనే సంక్షోభంలోకి నెడుతోందని తెలుస్తున్నప్పటికీ చాలామంది దీనిపై నోరు విప్పట్లేదు. ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ నిలదీయాల్సిన అవసరం లేదు కానీ.. ఇండస్ట్రీ ఇబ్బందిని కూడా సరిగా చెప్పలేకపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, సురేష్ బాబు, నాని లాంటి వాళ్లు తప్ప ఈ విషయంలో నిజాయితీగా స్పందించలేదనే  అభిప్రాయం ఇండస్ట్రీ నుంచే వ్యక్తమవుతోంది.

ఐతే వీరిలో ఒక్కొక్కొరు ఒక్కో రకంగా తమ భావాన్ని వ్యక్తం చేశారు. కానీ అంతిమగా వాళ్లందరూ సమస్య తీవ్రతను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వీరిలా ఇండస్ట్రీ వైపు నిలబడకపోగా.. ఇండస్ట్రీని తప్పుబట్టేలా మొన్న మోహన్ బాబు, ఇప్పుడు నాగార్జున మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వీళ్లిద్దరిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీరిపై నెటిజన్లలో ఇంత వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యం కలిగించే స్థాయిలో మొన్న మోహన్ బాబుపై, ఇప్పుడు నాగార్జునపై విమర్శల వర్షం కురుస్తోంది.

టికెట్ల ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేమో అనుకుంటే.. మోహన్ బాబు ఆశ్చర్యకరంగా ఇండస్ట్రీ జనాలనే నిలదీస్తూ లేఖ రాయడంతో విమర్శల పాలయ్యారు. అంతిమంగా వివిధ సమస్యలపై సమావేశాలను తనను పిలవకపోవడాన్ని నిరసిస్తున్నట్లుగా ఆయన స్వరం వినిపించారు. ఎవరో పిలవడం ఏంటి.. మీరే లీడ్ తీసుకొని ఉండొచ్చు కదా అనే ప్రశ్నలు ఆయనకు ఎదురయ్యాయి. ఇక ఏపీ సీఎంకు సన్మానం చేద్దాం, ఆయన్ని వేడుకుని సమస్యను పరిష్కరించుకుందాం అన్నట్లుగా ఆయన మాట్లాడటం చాలామందికి రుచించలేదు.

మోహన్ బాబు లేఖ తాలూకు ట్వీట్ కింద చూసినా.. ఆయన పేరు ట్రెండ్ అయిన తీరు చూసినా ఆయనపై సోషల్ మీడియాలో ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో అర్థమైపోతుంది. ఇప్పుడు నాగార్జున ఇంతకుమించిన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. జగన్‌తో ఉన్న స్నేహం, వ్యాపార బంధం మూలంగానే నాగ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టకుండా, ప్రశ్నించకుండా.. అసలు తగ్గించిన టికెట్ల రేట్లతో తనకు సమస్యే లేదన్నట్లుగా మాట్లాడారంటూ ఆయన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. రోశయ్య సీఎంగా ఉన్న టైంలో ‘రగడ’ సినిమా ఆడియో వేడుక సందర్భంగా ఆయన ఆ వేదిక మీది నుంచే పైరసీ మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని తీవ్ర స్వరంతో మాట్లాడారు. తమ దగ్గర 50-60 శాతం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసుకుని జేబుల్లో వేసుకుంటూ, తమ సమస్య పరిష్కారానికి ఏమీ చేయట్లేదన్నారు. ఐతే అప్పుడు సినిమా వేడుకలో అలా మాట్లాడి ఇప్పుడేమో ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడను, మాట్లాడటం తప్పు అనడం ఏంటంటూ ఆ వీడియో పెట్టి నాగ్‌ను నిలదీస్తున్నారు నెటిజన్లు.

This post was last modified on February 19, 2022 3:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

3 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

5 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

6 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

6 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

8 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

8 hours ago