ఆ ఫ్యామిలీకి రూ.7.35 కోట్లను ఎయిరిండియాను ఇవ్వమన్న సుప్రీం

ఒక ప్రయాణికుడి కుటుంబానికి రూ.7.35 కోట్ల పరిహారాన్ని ఎయిరిండియా ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విమాన ప్రమాదంలో మరణించినకుటుంబానికి ఈ మొత్తాన్ని ఇవ్వాలంది. ఇంత మొత్తాన్ని ఆ కుటుంబానికి ఎందుకు ఇవ్వాలని సుప్రీం చెప్పిందన్న విషయంలోకి వెళితే.. 2010లొ మంగళూరులో ఒక విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

దుబాయ్ నుంచి 166 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన వారిలో 158 మంది ప్రాణాల్ని కోల్పోయారు. ఇలా ప్రాణం విడిచిన వారిలో యూఏఈకి చెందిన ఒక సంస్థ రీజనల్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఆయన పేరు మహేంద్ర. నలభై ఐదేళ్ల ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఎయిరిండియా తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని కోరింది.

ఇదే విషయాన్ని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కూడా వెల్లడించింది. ఈ పరిహారాన్ని చెల్లించేందుకు ఎయిరిండియా ముందుకు రాలేదు. దీంతో మహేంద్ర కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినప్పుడు.. ఆ వ్యక్తి చేసే ఉద్యోగం స్థాయి ఆదారంగా అతని ఆదాయాన్ని పరిగణించాలని పేర్కొంది. ఇందులో భాగంగా రూ.7.35 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని.. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించకుంటే ఏడాదికి తొమ్మిది శాతం చొప్పున వడ్డీతో సహా చెల్లించాలని పేర్కొన్నారు.

This post was last modified on May 22, 2020 12:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయ్‌కి దినదిన గండమేనా?

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మూణ్నాలుగు రోజులుగా నడుస్తున్న సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ విజయ్‌కి అవకాశమిచ్చాడు. సొంతంగా…

6 minutes ago

మోడీ విష‌యంలో… కేసీఆర్‌కు భిన్నంగా రేవంత్‌..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అనుస‌రిస్తున్న తీరు.. గ‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన…

2 hours ago

తెలంగాణ‌పై మోడీ: అప్పుడొక మాట‌.. ఇప్పుడొక మాట‌.. ?

తెలంగాణ‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో ఆయ‌న పార్ల‌మెంటులో…

3 hours ago

తమిళ మంత్రి కీర్తన.. గతంలో టీడీపీకి..?

తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…

4 hours ago

విశ్వనాథ్ సన్స్ అంత రిస్కు చేస్తారా

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…

5 hours ago

జగపతి… అది వదులుకొని ఇది పట్టుకున్నారా

హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…

6 hours ago