ఒక ప్రయాణికుడి కుటుంబానికి రూ.7.35 కోట్ల పరిహారాన్ని ఎయిరిండియా ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విమాన ప్రమాదంలో మరణించినకుటుంబానికి ఈ మొత్తాన్ని ఇవ్వాలంది. ఇంత మొత్తాన్ని ఆ కుటుంబానికి ఎందుకు ఇవ్వాలని సుప్రీం చెప్పిందన్న విషయంలోకి వెళితే.. 2010లొ మంగళూరులో ఒక విమాన ప్రమాదం చోటు చేసుకుంది.
దుబాయ్ నుంచి 166 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన వారిలో 158 మంది ప్రాణాల్ని కోల్పోయారు. ఇలా ప్రాణం విడిచిన వారిలో యూఏఈకి చెందిన ఒక సంస్థ రీజనల్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఆయన పేరు మహేంద్ర. నలభై ఐదేళ్ల ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఎయిరిండియా తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని కోరింది.
ఇదే విషయాన్ని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కూడా వెల్లడించింది. ఈ పరిహారాన్ని చెల్లించేందుకు ఎయిరిండియా ముందుకు రాలేదు. దీంతో మహేంద్ర కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినప్పుడు.. ఆ వ్యక్తి చేసే ఉద్యోగం స్థాయి ఆదారంగా అతని ఆదాయాన్ని పరిగణించాలని పేర్కొంది. ఇందులో భాగంగా రూ.7.35 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని.. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించకుంటే ఏడాదికి తొమ్మిది శాతం చొప్పున వడ్డీతో సహా చెల్లించాలని పేర్కొన్నారు.
This post was last modified on May 22, 2020 12:37 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…