పొల్యూషన్ పుణ్యమా అని నగరాల్లో.. మహానగరాల్లో ముఖానికి గుడ్డలు కట్టుకొని వెళ్లటం చూశాం. మాయదారి రోగం పుణ్యమా అని.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా బయటకు వచ్చే వారెవరైనా సరే.. మాస్కులు ధరించాలన్న నియమాన్ని పెట్టటమే కాదు.. దాన్ని ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయిలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయమే కాదు.. ప్రాణాలకు ప్రమాదంగా మారే మాయదారి రోగం బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్కులు ధరించటం ఇప్పుడు అందరూ ఒక అలవాటుగా చేసుకున్నారు. ఇంట్లో నుంచి అడుగు తీసి బయటకు పెడితే చాటు.. ముఖానికి ఏదో ఒకటి అడ్డుగా పెట్టుకోవటం ఇప్పుడు మామూలైంది. అందుకు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకుంది.
రానా దగ్గుబాటి.. మిహీకా బజాజ్ జరిగిన రోకా వేడుకకు సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్ మెంట్ తరహాలోనే నార్త్ స్టైల్ లో రోకా వేడుక జరిగింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ ప్రోగ్రాంలో మాస్కుల ముచ్చటే కనిపించలేదంటున్నారు.
పరిమిత సంఖ్యలో ప్రోగ్రాం జరగటం.. వేడుకలో ఉన్నోళ్లంతా కుటుంబ సభ్యులే కావటంతో మాస్కులు కనిపించలేదని చెబుతున్నారు. ఏమైనా.. ఇటీవల కాలంలో మాస్కులు లేకుండా నలుగురు కలిసి ఉండటం మాత్రం ఇదే తొలిసారన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on May 22, 2020 12:25 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…