పొల్యూషన్ పుణ్యమా అని నగరాల్లో.. మహానగరాల్లో ముఖానికి గుడ్డలు కట్టుకొని వెళ్లటం చూశాం. మాయదారి రోగం పుణ్యమా అని.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా బయటకు వచ్చే వారెవరైనా సరే.. మాస్కులు ధరించాలన్న నియమాన్ని పెట్టటమే కాదు.. దాన్ని ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయిలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయమే కాదు.. ప్రాణాలకు ప్రమాదంగా మారే మాయదారి రోగం బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్కులు ధరించటం ఇప్పుడు అందరూ ఒక అలవాటుగా చేసుకున్నారు. ఇంట్లో నుంచి అడుగు తీసి బయటకు పెడితే చాటు.. ముఖానికి ఏదో ఒకటి అడ్డుగా పెట్టుకోవటం ఇప్పుడు మామూలైంది. అందుకు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకుంది.
రానా దగ్గుబాటి.. మిహీకా బజాజ్ జరిగిన రోకా వేడుకకు సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్ మెంట్ తరహాలోనే నార్త్ స్టైల్ లో రోకా వేడుక జరిగింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ ప్రోగ్రాంలో మాస్కుల ముచ్చటే కనిపించలేదంటున్నారు.
పరిమిత సంఖ్యలో ప్రోగ్రాం జరగటం.. వేడుకలో ఉన్నోళ్లంతా కుటుంబ సభ్యులే కావటంతో మాస్కులు కనిపించలేదని చెబుతున్నారు. ఏమైనా.. ఇటీవల కాలంలో మాస్కులు లేకుండా నలుగురు కలిసి ఉండటం మాత్రం ఇదే తొలిసారన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on May 22, 2020 12:25 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…