దక్షిణాది స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన శంకర్ ఈ మధ్యకాలంలో వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ సినిమాను మొదలుపెట్టారాయన. కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుండి అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. సెట్స్ లో జరిగిన ప్రమాదంలో టెక్నీషియన్స్ మరణించడం, తరువాత కమల్ ఎన్నికల్లో బిజీ అవ్వడం ఇలా పలు కారణాల వలన షూటింగ్ ఆగిపోయింది.
లైకా ప్రొడక్షన్స్ ఎంతసేపటికీ షూటింగ్ పునః ప్రారంభించకపోవడంతో శంకర్ తన తదుపరి సినిమాలను అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా అలానే రణవీర్ సింగ్ హీరోగా ‘అపరిచితుడు’ రీమేక్ లను ప్లాన్ చేశారు. దీంతో లైకా సంస్థ శంకర్ పై కేసు పెట్టింది. తమ సినిమా పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ మరో సినిమా చేయడానికి వీళ్లేదని లైకా వాదిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. వచ్చే నెలలో ఈ కేసుపై కోర్టు తీర్పు ఇవ్వనుంది.
ఇదిలా ఉండగా.. శంకర్ ప్రస్తుతం తన కూతురు పెళ్లి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్ కి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు అదితి శంకర్ కు గతేడాది నిశితార్థం జరిగింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో కూతురి పెళ్లి ఖాయం చేశారు శంకర్. తమిళనాడులోని పొల్లాచిలో అదితి వివాహం జరగనుంది. వచ్చే వారంలో శంకర్ కుటుంబం మొత్తం పొల్లాచికి వెళ్లనుంది. ఇప్పటికే శంకర్ పొల్లాచి చేరుకొని అక్కడ పనులు చూసుకుంటున్నట్లు సమాచారం.
This post was last modified on June 22, 2021 6:05 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…