Uncategorized

ఆ సినిమా చేయట్లేదన్న కీర్తి సురేష్

‘మహానటి’తో దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు తన వైపు తిరిగి చూసేలా చేసిన నటి కీర్తి సురేష్. ఆ చిత్రం ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద విజయం సాధించింది. కన్నడ, మలయాళ ప్రేక్షకులు కూడా అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను బాగానే చూశారు. కీర్తికి ఈ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు రావడంతో ఉత్తరాది వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు.

ఈ గుర్తింపుతో కీర్తికి హిందీలోనూ ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదే.. మైదాన్. హైదరాబాద్‌కు చెందిన ఓ లెజెండరీ ఫుట్‌బాలర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇందులో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ చేస్తుండగా.. ఆయన సరసన కీర్తిని ఎంచుకున్నారు. సినిమా మొదలైనపుడు అధికారికంగా కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా-లాక్ డౌన్ లేకుంటే ఇప్పటికే ఈ చిత్రం పూర్తి కావాల్సింది కూడా.

కరోనాతో బ్రేక్ పడ్డ ఈ చిత్రాన్ని త్వరలోనే మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు తాజాగా కీర్తి వెల్లడించింది. తన కొత్త చిత్రం ‘మిస్ ఇండియా’ ప్రమోషన్లలో భాగంగా ఆమె మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించింది. కారణాలు చెప్పలేదు కానీ.. ఆ సినిమాలో తాను భాగం కాదని మాత్రం తెలిపింది. మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించబోతుండటం చాలా ఉద్వేగంగా ఉన్నట్లు చెప్పింది కీర్తి.

తమిళంలో రజనీకాంత్ సరసన ‘అన్నాత్తె’లో ఓ విభిన్నమైన పాత్ర చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. మలయాళంలో మోహన్ లాల్ సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలిపింది. మరో రెండు పెద్ద సినిమాలు చర్చల దశలో ఉన్నాయంది. ‘మహానటి’ తర్వాత తాను విని ఓకే చేేసిన తొలి కథ ‘మిస్ ఇండియా’దే అని.. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ఈ సినిమాలో పాత్ర డిమాండ్ చేయడంతోనే తాను బాగా బరువు తగ్గాల్సి వచ్చిందని చెప్పింది కీర్తి. మంగళవారం అర్ధరాత్రి నుంచే ‘మిస్ ఇండియా’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.

This post was last modified on November 3, 2020 10:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

9 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

10 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago