‘మహానటి’తో దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు తన వైపు తిరిగి చూసేలా చేసిన నటి కీర్తి సురేష్. ఆ చిత్రం ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద విజయం సాధించింది. కన్నడ, మలయాళ ప్రేక్షకులు కూడా అమేజాన్ ప్రైమ్లో ఈ సినిమాను బాగానే చూశారు. కీర్తికి ఈ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు రావడంతో ఉత్తరాది వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు.
ఈ గుర్తింపుతో కీర్తికి హిందీలోనూ ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదే.. మైదాన్. హైదరాబాద్కు చెందిన ఓ లెజెండరీ ఫుట్బాలర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇందులో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ చేస్తుండగా.. ఆయన సరసన కీర్తిని ఎంచుకున్నారు. సినిమా మొదలైనపుడు అధికారికంగా కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా-లాక్ డౌన్ లేకుంటే ఇప్పటికే ఈ చిత్రం పూర్తి కావాల్సింది కూడా.
కరోనాతో బ్రేక్ పడ్డ ఈ చిత్రాన్ని త్వరలోనే మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు తాజాగా కీర్తి వెల్లడించింది. తన కొత్త చిత్రం ‘మిస్ ఇండియా’ ప్రమోషన్లలో భాగంగా ఆమె మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించింది. కారణాలు చెప్పలేదు కానీ.. ఆ సినిమాలో తాను భాగం కాదని మాత్రం తెలిపింది. మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించబోతుండటం చాలా ఉద్వేగంగా ఉన్నట్లు చెప్పింది కీర్తి.
తమిళంలో రజనీకాంత్ సరసన ‘అన్నాత్తె’లో ఓ విభిన్నమైన పాత్ర చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. మలయాళంలో మోహన్ లాల్ సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలిపింది. మరో రెండు పెద్ద సినిమాలు చర్చల దశలో ఉన్నాయంది. ‘మహానటి’ తర్వాత తాను విని ఓకే చేేసిన తొలి కథ ‘మిస్ ఇండియా’దే అని.. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ఈ సినిమాలో పాత్ర డిమాండ్ చేయడంతోనే తాను బాగా బరువు తగ్గాల్సి వచ్చిందని చెప్పింది కీర్తి. మంగళవారం అర్ధరాత్రి నుంచే ‘మిస్ ఇండియా’ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానుంది.
This post was last modified on November 3, 2020 10:30 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…