Uncategorized

ఆ సినిమా చేయట్లేదన్న కీర్తి సురేష్

‘మహానటి’తో దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు తన వైపు తిరిగి చూసేలా చేసిన నటి కీర్తి సురేష్. ఆ చిత్రం ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద విజయం సాధించింది. కన్నడ, మలయాళ ప్రేక్షకులు కూడా అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను బాగానే చూశారు. కీర్తికి ఈ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు రావడంతో ఉత్తరాది వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు.

ఈ గుర్తింపుతో కీర్తికి హిందీలోనూ ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదే.. మైదాన్. హైదరాబాద్‌కు చెందిన ఓ లెజెండరీ ఫుట్‌బాలర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇందులో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ చేస్తుండగా.. ఆయన సరసన కీర్తిని ఎంచుకున్నారు. సినిమా మొదలైనపుడు అధికారికంగా కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా-లాక్ డౌన్ లేకుంటే ఇప్పటికే ఈ చిత్రం పూర్తి కావాల్సింది కూడా.

కరోనాతో బ్రేక్ పడ్డ ఈ చిత్రాన్ని త్వరలోనే మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు తాజాగా కీర్తి వెల్లడించింది. తన కొత్త చిత్రం ‘మిస్ ఇండియా’ ప్రమోషన్లలో భాగంగా ఆమె మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించింది. కారణాలు చెప్పలేదు కానీ.. ఆ సినిమాలో తాను భాగం కాదని మాత్రం తెలిపింది. మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించబోతుండటం చాలా ఉద్వేగంగా ఉన్నట్లు చెప్పింది కీర్తి.

తమిళంలో రజనీకాంత్ సరసన ‘అన్నాత్తె’లో ఓ విభిన్నమైన పాత్ర చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. మలయాళంలో మోహన్ లాల్ సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలిపింది. మరో రెండు పెద్ద సినిమాలు చర్చల దశలో ఉన్నాయంది. ‘మహానటి’ తర్వాత తాను విని ఓకే చేేసిన తొలి కథ ‘మిస్ ఇండియా’దే అని.. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ఈ సినిమాలో పాత్ర డిమాండ్ చేయడంతోనే తాను బాగా బరువు తగ్గాల్సి వచ్చిందని చెప్పింది కీర్తి. మంగళవారం అర్ధరాత్రి నుంచే ‘మిస్ ఇండియా’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.

This post was last modified on November 3, 2020 10:30 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

1 hour ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

1 hour ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

2 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

3 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

4 hours ago

బాహుబలి బ్రాండు విలువ ఎప్పటిదాకా

టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద…

4 hours ago