Mahesh babu, Sukumar, Allu Arjun
సుకుమార్ కొత్త సినిమా ‘పుష్ప’ కథను ముందు మహేష్ బాబు కోసమే తయారు చేసిన సంగతి తెలిసిందే. కానీ అనివార్య కారణాల వల్ల వీళ్లిద్దరూ కలిసి ఈ సినిమా చేయలేకపోయారు. మహేష్ నో చెప్పాక కథలో కొన్ని మార్పులు చేసి అల్లు అర్జున్ను లైన్లోకి తీసుకున్నాడు సుక్కు.
ఈ మధ్యే రిలీజైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ చూస్తే మాత్రం ఈ సినిమాకు బన్నీనే కరెక్ట్ అనే అభిప్రాయం ఏర్పడింది. మహేష్ ఇది చేయకపోవడం మంచిదే అనుకున్నారు. కానీ దీని కంటే ముందు మహేష్ కోసం సుక్కు వేరే కథ అనుకోవడం విశేషం.
దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సుక్కు. ‘రంగస్థలం’ రిలీజ్ తర్వాత ఏ సినిమా చేయాలా అనే ఆలోచనలో ఉన్నపుడు సుక్కు దృష్టి తెలంగాణ సాయుధ పోరాటం మీద పడింది. కొన్ని నెలల పాటు దీనికి సంబంధించి అనేక పుస్తకాలు చదివారు సుక్కు.
అప్పట్లో సుక్కు తెలంగాణ సాయుధ పోరాటం మీద విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఆయన సన్నిహితులు కొందరు మీడియాకు వెల్లడించారు. మొత్తం చదివాక కొంత మేర స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. ఒక ఎమోషనల్ ఎపిసోడ్ చుట్టూ కథను అల్లారు. ఆ కథతోనే మహేష్తో సినిమా చేయాలని ఒక దశలో అనుకున్నాడు సుక్కు.
కానీ చాలా సుకుమారంగా, రిచ్గా కనిపించే మహేష్తో తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సినిమా తీస్తే వర్కవుట్ కాదని కొందరు సలహా ఇవ్వడంతో కొత్త కథ కోసం అన్వేషణ జరిగింది. ఆ క్రమంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో కథ ఖరారైంది. కానీ చివరికి ఈ కథ కూడా మహేష్కు సెట్ అవుతుందో కాదో అన్న సందేహాలు కలిగాయి.
సుకుమార్ రెడీగా ఉన్నప్పటికీ మహేష్కే డౌట్లు కొట్టి.. ఈ సినిమాతో ఉన్న కష్ట నష్టాల్ని బేరీజు వేసుకుని దీన్నుంచి తప్పుకున్నాడు. తర్వాత బన్నీ లైన్లోకి వచ్చాడు. తెలంగాన సాయుధ పోరాటం మీద సుక్కు దగ్గర స్క్రిప్టు రెడీగా ఉన్న నేపథ్యంలో రేప్పొద్దున విజయ్ దేవరకొండ లాంటి హీరోను పెట్టి ఈ సినిమా తీసినా తీయొచ్చేమో.
This post was last modified on April 29, 2020 4:25 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…