Plasma
కరోనా వైరస్ సోకిన వారికి నిర్దిష్టమైన చికిత్స లేదు. దానికి ఇంకా మందు కనుగొనలేదు. వ్యాక్సిన్ రావడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న మందులు, చికిత్స పద్ధతులతో రోగుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. చివరి దశలో ఉన్న రోగులపై రకరకాల మందులు, కాంబినేషన్లు ప్రయోగించి చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్లాస్మా థెరపీ చికిత్స తెరపైకి వచ్చింది. వివిధ రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి దాని ద్వారా చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈ పద్ధతిలో.
ఐతే ఈ థెరపీ వినియోగంపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్స విధానం కాదని, ఇది ప్రయోగ దశలోనే ఉందని.. దీన్ని అనుసరించవద్దని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్లాస్మా థెరపీపై పరిశోధన జరుపుతోందని కేంద్రం ప్రకటించింది.ప్లాస్మా చికిత్స విధానాన్ని అనుసరించడం కరోనా బాధితులను ప్రమాదంలోకి నెట్టొచ్చని.. ఈ పద్ధతిని అనుసరించడం చట్ట విరుద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.
కరోనాకు ప్లాస్మా థెరపీనే సరైన చికిత్స విధానమని ఎలాంటి ఆధారం లేదని ఆయన తెలిపారు. ప్లాస్మా థెరపీ సామర్థ్యంపై జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఐసీఎంఆర్ అధ్యయనం పూర్తయ్యే లోపు, ఈ చికిత్స సరైందేనని శాస్త్రీయ నిరూపణ జరిగే వరకూ ప్లాస్మా థెరపీని కేవలం ప్రయోగపరంగానే అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఐతే రాష్ట్రాలు మాత్రం ప్లాస్మా థెరపీని అనుసరిస్తూ.. కరోనా నుంచి కోలుకున్న రక్తదానం చేసి ఈ చికిత్సకు సహకరించాలని కోరుతున్నాయి. మరి కేంద్రం ప్రకటన నేపథ్యంలో రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి.
This post was last modified on April 29, 2020 11:27 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…