ప్లాస్మా చికిత్స‌.. రాష్ట్రాల‌కు కేంద్రం షాక్

క‌రోనా వైర‌స్ సోకిన వారికి నిర్దిష్ట‌మైన చికిత్స లేదు. దానికి ఇంకా మందు క‌నుగొన‌లేదు. వ్యాక్సిన్ రావ‌డానికి కూడా చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో అందుబాటులో ఉన్న మందులు, చికిత్స ప‌ద్ధతుల‌తో రోగుల్ని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారు వైద్యులు. చివ‌రి ద‌శ‌లో ఉన్న రోగుల‌పై ర‌క‌ర‌కాల మందులు, కాంబినేష‌న్లు ప్ర‌యోగించి చూస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప్లాస్మా థెర‌పీ చికిత్స తెర‌పైకి వ‌చ్చింది. వివిధ రాష్ట్రాలు ప్రయోగాత్మ‌కంగా ఈ ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేక‌రించి దాని ద్వారా చికిత్స అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఈ ప‌ద్ధ‌తిలో.

ఐతే ఈ థెర‌పీ వినియోగంపై కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్స విధానం కాదని, ఇది ప్రయోగ‌ దశలోనే ఉందని.. దీన్ని అనుస‌రించ‌వ‌ద్ద‌ని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్లాస్మా థెరపీపై పరిశోధన జరుపుతోందని కేంద్రం ప్రకటించింది.ప్లాస్మా చికిత్స విధానాన్ని అనుసరించడం కరోనా బాధితుల‌ను ప్ర‌మాదంలోకి నెట్టొచ్చ‌ని.. ఈ ప‌ద్ధ‌తిని అనుస‌రించ‌డం చట్ట విరుద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.

కరోనాకు ప్లాస్మా థెర‌పీనే స‌రైన చికిత్స విధానమని ఎలాంటి ఆధారం లేదని ఆయన తెలిపారు. ప్లాస్మా థెరపీ సామర్థ్యంపై జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఐసీఎంఆర్ అధ్యయనం పూర్తయ్యే లోపు, ఈ చికిత్స సరైందేనని శాస్త్రీయ నిరూపణ జరిగే వరకూ ప్లాస్మా థెరపీని కేవలం ప్రయోగపరంగానే అనుసరించాలని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఐతే రాష్ట్రాలు మాత్రం ప్లాస్మా థెరపీని అనుస‌రిస్తూ.. కరోనా నుంచి కోలుకున్న ర‌క్త‌దానం చేసి ఈ చికిత్స‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నాయి. మ‌రి కేంద్రం ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి.

This post was last modified on April 29, 2020 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

3 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

4 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

5 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

7 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

8 hours ago