Trends

ప్రపంచకప్ ఫైనల్లో పంత్ చేసిన గిమ్మిక్

ఫుట్‌బాల్‌లో పెనాల్టీ రాబట్టేందుకు ఆటగాళ్లు అద్భుతమైన నట విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. ప్రత్యర్థి ఆటగాళ్లు తమను కనీసం తాకకున్నా.. వాళ్లు తమను గాయపరిచినట్లుగా నటిస్తుంటారు. అలాగే ఉద్దేశపూర్వకంగా అవతలి ఆటగాడిని గాయపరిచి తమకేమీ తెలియనట్లు నటించే వాళ్లూ ఉంటారు. ఫుట్‌బాల్‌లో ఉండే నటన మరే ఆటలో ఉండదు అంటే అతిశయోక్తి కాదు.

ఐతే క్రికెట్లో కూడా అప్పుడప్పుడూ కొన్ని ప్రయోజనాలు ఆశించి ఇలా నటించేవాళ్లుంటారు. గతంలో బైరన్నర్ కోసమని గాయం కాకున్నా అయినట్లు ఆటగాళ్లు నటించేవాళ్లు. ఐతే బైరన్నర్ రూలే తీసేసింది ఐసీసీ. కాగా ఈ ఏడాది దక్షిణాఫ్రికాపై భారత జట్టు అద్భుత విజయం సాధించిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో తమ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన నట విన్యాసం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం బయటపెట్టాడు.

ఫైనల్లో దక్షిణాఫ్రికా ముందు 177 పరుగుల లక్ష్యం నిలవగా.. క్లాసెన్ చెలరేగడంతో 30 బంతుల్లో 30 పరుగులే చేయాల్సిన స్థితికి చేరుకుంది దక్షిణాఫ్రికా. కప్పు ఆ జట్టు సొంతమైనట్లే అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ చివరి ఐదు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత్.. 7 పరుగుల తేడాతో గెలిచి కప్పు ఎగరేసుకుపోయింది. ఐతే క్లాసెన్ చెలరేగుతున్న టైంలో పంత్ చేసిన గిమ్మిక్ గురించి రోహిత్ తాజాగా వెల్లడించాడు.

తనకు కాలు పట్టేసినట్లు నటించిన మ్యాచ్‌లో చిన్న బ్రేక్ వచ్చేలా పంత్ చేసినట్లు రోహిత్ తెలిపాడు. మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మళ్లిన సమయంలో త్వరగా పని అయిపోవాలని క్లాసెన్ భావించాడని.. ఆ స్పీడులో అతను మ్యాచ్‌ను ముగించేసేవాడని రోహిత్ అన్నాడు. ఆ టైంలో క్లాసెన్ వేగం తగ్గించడానికి, తమ వ్యూహాలు సమీక్షించుకోవడానికి చిన్న బ్రేక్ అవసరమైందని.. అప్పుడే పంత్ కాలు పట్టేసినట్లు చెప్పి ఫిజియోను రప్పించాడని.. కాలికి పట్టీ కూడా వేసుకున్నాడని.. ఆ విరామం తమకు మేలు చేసిందని.. క్లాసెన్ లయ దెబ్బ తిని వెంటనే ఔటైపోయాడని.. అక్కడి నుంచి తాము పట్టు బిగించి విజయం వైపు మళ్లామని.. అందుకే ఈ విజయంలో పంత్ పాత్ర కీలకమని రోహిత్ చెప్పాడు. ఈ విషయం తెలిసి భారత అభిమానులు సోషల్ మీడియాలో పంత్‌ను కొనియాడుతున్నారు.

This post was last modified on October 6, 2024 8:25 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

3 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

7 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

10 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

11 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

11 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

12 hours ago