డాక్టర్ రెడ్డీస్ సతీష్ రెడ్డి..మైహోమ్ జూపల్లి రామేశ్వర్.. హెటెరో పార్థసారథి.. నవయుగ విశ్వేశ్వరరావు.. ఈనాడు రామోజీ.. అపర్ణ కన్ స్ట్రక్షన్స్ వెంకటేశ్వరరెడ్డి.. విజయ్ ఎలక్ట్రికల్స్ దాసరి జై రమేశ్.. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటే పోతే.. తెలుగు నేల మీద నిత్యం పలువురి మాటల్లో వినిపించే పేర్లు ఇవి. ఈ ప్రముఖల ఆస్తుల విలువ ఎంతన్నంతనే ఎవరికి తోచింది వారు చెబుతుంటారు. అందుకు భిన్నంగా ఎవరి ఆస్తి ఎంత అన్న విషయంపై క్లారిటీ వస్తే ఎంతో బాగుంటుంది కదా?
తాజాగా అలాంటి అవకాశమే వచ్చింది. ప్రతి ఏటా దేశీయంగా సంపన్నులు.. వారి కుటుంబాల ఆస్తుల లెక్కల్ని మదింపు చేసి జాబితాను విడుదల చేసే హురున్ రిచ్ లిస్టు లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కుబేరుల ఆస్తుల లెక్కలు బయటకు వచ్చాయి. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 62 మంది చోటు దక్కించుకోగా.. వారిలో టాప్ 20 ఆస్తుల వివరాలు ఏమిటన్న విషయంపై క్లారిటీ రాక మానదు.
అపర కుబేరులు.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల పేర్లు.. వారి సంపద ఎంతన్న విషయంపై వివరాలు బయటకు వచ్చాయి. టాప్ టెన్ సంపన్నులతోపాటు.. ఈ ఏడాది కొత్తగా లిస్టులోకి వచ్చి చేరిన ప్రముఖుల్లో టాప్ టెన్ సంపన్నుల్ని చూస్తే..
పేరు-ఫ్యామిలీ కంపెనీ సంపద విలువ (కోట్లల్లో)
మురళీ దివి దివిస్ ల్యాబ్స్. 49,200
బి పార్థసారథి హెటెరో డ్రగ్స్ 13,900
కె. సతీశ్ రెడ్డి డాక్టర్ రెడ్డీస్ 11,200
పి. పిచ్చిరెడ్డి ఎంఈఐఎల్ 11,100
పి.వి. క్రిష్ణరెడ్డి ఎంఈఐఎల్ 10,700
జి.వి.ప్రసాద్..అనురాధ డాక్టర్ రెడ్డీస్ 9,400
జూపల్లి రామేశ్వర్ రావు మైహోం 8,900
ఎం సత్యనారాయణరెడ్డి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ 8,700
వి.సి. నన్నపనేని నాట్కో ఫార్మా 7,500
సి. విశ్వేశ్వర రావు నవయుగ 4,900
This post was last modified on September 30, 2020 11:48 am
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…