కొంతమంది కొన్నిసార్లు ఇట్టే ఫేమస్ అయిపోతారు. సాదాసీదా జీవితాలే అయినప్పటికీ.. ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోతుంటారు. అలాంటి కోవలోకే వస్తారు కుమారి ఆంటీ. ఐటీ నగరిలో ఫుట్ పాత్ మీద చిన్న హోటల్ పెట్టుకొని.. రుచికరమైన ఫుడ్ ను సరసమైన ధరల్లో అందించే కుమారి ఆంటీ షాపుపై అధికారులు ప్రతాపం చూడటం.. దీనిపై ఆమె ఆవేదనకు.. నెటిజన్లు.. సోషల్ మీడియా అండగా ఉండటం తెలిసిందే. కట్ చేస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్టు కావటం.. అభయం ఇవ్వటంతో ఆమె జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.
అలా కొన్నివారాల పాటు నాన్ స్టాప్ గా వార్తల్లో వ్యక్తిగా మారిన కుమారి ఆంటీ.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమె తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వారికి సాయంగా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50వేలు సాయాన్ని చెక్కు రూపంలో అందించారు. చిరు మొత్తమే అయినా.. ఇస్తున్నది కుమారి ఆంటీ కావటంతో సీన్లోకి సీఎం వచ్చేశారు.
ముఖ్యమంత్రిని కలిసి.. ఆయనకు తమకు తోచిన సాయాన్ని ఇస్తున్న వైనానికి ముఖ్యమంత్రి సైతం స్పందించి ఆమెను అభినందించారు. కష్టంలో ఉన్న ప్రజలకు తన వంతు సాయంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కుమారి ఆంటీకి మరోసారి నెటిజన్లు అండగా నిలిచారు. ఆమె నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి వెళ్లి మరీ.. సాయాన్ని అందించిన ఆమెను ప్రశంసిస్తున్న వైనంతో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారారు.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…