కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ‘పోర్టు బ్లెయిర్’ పేరును మార్చేసింది. పోర్టు బ్లెయిర్కు కొత్తగా ‘శ్రీవిజయపురం’ పేరును పెట్టింది. ఇక, నుంచి అధికారికంగా ఈ పేరు మనుగడలోకి వస్తుందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. దేశ స్వాతంత్య్ర సమరం నుంచి కూడా పోర్టు బ్లెయిర్కు ప్రాధాన్యం ఉంది.
అప్పట్లో దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన వారిని అరెస్టు చేసి.. పోర్టు బ్లెయిర్లో నిర్మించిన సెల్యూలర్ (భూగ ర్భ) జైల్లోనే నిర్బంధించారు. కరడు గట్టిన తీవ్ర వాదులను ఇక్కడ నిర్బంధించడం తెలిసిందే. అలాంటి ప్రాంతం లో స్వాతంత్య్ర సమరయోదులను నిర్బంధించడం.. అప్పట్లో నిరసనకు కూడా దారి తీసింది. ఇక, బ్రిటీష్ కాలంలోనే దీనిని ఏర్పాటు చేయడంతో ‘పోర్టు బ్లెయిర్’గా పిలవడం ప్రారంభించారు.
అప్పట్లో ఇది యుద్ధ ఖైదీలను నిర్బంధించే పెద్ద జైలుగా చలామణి అయింది. ఇక, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. కూడా కొన్నాళ్లు దీనిని వినియోగంలో ఉంచినా.. తర్వాత.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు గుర్తుగా.. దీనిని పరిరక్షిస్తున్నారు. ఇక్కడే తొలి సారి జాతీయ పతాకాన్ని సుభాష్ చంద్రబోస్ ఎగురవేశారు. దీనికి సంబంధించిన అన్ని చారిత్రక ఆధారాలను కూడా జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు.
అయితే.. వలస వాద విధానాలు, చట్టాలను మారుస్తున్న మోడీ సర్కారు ఈ పరంపరంలోనే ఇప్పుడు పోర్టు బ్లెయిర్ పేరును కూడా మార్పు చేసింది. దీనికి శ్రీవిజయపురం పేరును నిర్ణయించింది. ఇక్కడ నుంచే మనకు విజయం దక్కిందన్నది మోడీ ప్రభుత్వం చెబుతున్న మాట. దేశస్వాతంత్య్ర పోరాటానికి తొలి విజయం ఇక్కడే ప్రారంభ మైందని.. అందుకే ‘శ్రీవిజయపురం’ పేరును ఖరారు చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఇక, నుంచి శ్రీవిజయపురం అనేది అధికారిక నామంగా గుర్తించాలని పేర్కొంది.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…