Trends

‘మనమే’ వెనుక మహా మోసం

శర్వానంద్ నటించిన మనమే థియేటర్లలో గొప్ప ఫలితం అందుకోలేదు కానీ ఉన్నంతలో ఓ మోస్తరుగా ఆడి సెలవు తీసుకుంది. ఇది జరిగి రెండు నెలలు దాటినా ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. హీరోయిన్ కృతి శెట్టి, హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం, చైల్డ్ సెంటిమెంట్ ఇలా ఎన్నో ఆకర్షణలు డిజిటల్ ఆడియన్స్ ని ఎదురు చూసేలా చేశాయి. కానీ రోజులు గడిచే కొద్దీ కాలం కరిగిపోతోంది కానీ మనమే దర్శనం మాత్రం జరగలేదు. అదిగో ఇదిగో అంటూ ఊరించడమే తప్ప అప్డేట్ రాలేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద సంస్థ తీసిన మూవీకి ఇలా జరగడం ఆశ్చర్యం. ఫైనల్ గా క్లారిటీ వచ్చింది.

ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత టిజి విశ్వప్రసాద్ స్పష్టత ఇచ్చారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ని మూడో పార్టీ ద్వారా ముందే అమ్మేశామని, కానీ వాళ్ళు మోసం చేయడం వల్ల 70 నుంచి 80 శాతం దాకా పెట్టుబడి నష్టపోయినట్టు వివరించారు. అంతేకాదు ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందువల్ల త్వరలోనే న్యాయం జరిగి సినిమా బయటికి వచ్చాక అప్పుడు మోసగాళ్ల తాలూకు డీటెయిల్స్ వెల్లడిస్తానని అన్నారు. అయితే ఆ ఛీటర్ ఎవరనే దాని గురించి రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి. పలు నిర్మాతలు ఇదే తరహాలో మోసానికి గురైనప్పటికీ ఇతరత్రా కారణాల వల్ల మౌనంగా ఉన్నారు.

ఈ వివాదం బయటికి రావడం మంచిదే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఓటిటి బిజినెస్ పేరుతో కొందరు బ్లాక్ మైలర్స్ గా మారిపోయారు. తక్కువ ధరకు ప్రొడ్యూసర్ దగ్గర హక్కులు కొని వాటిని స్ట్రీమింగ్ కంపెనీలకు ఎక్కువ రేట్ కి అమ్మడమో లేదా పే పర్ వ్యూలో అధిక సొమ్ములు చేసుకుని దాన్ని నిర్మాతకు చెప్పకుండా మేనేజ్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. విశ్వప్రసాద్ కుండబద్దలు కొట్టేయడంతో మరికొందరు దీని గురించి నోరు విప్పే ఛాన్స్ ఉంది. మనమే లాంటి మ్యూజికల్ ఎంటర్ టైనర్ స్క్రీన్ మీద ఆడకపోయినా ఇంట్లో చూడాల్సిన ఎంటర్ టైనరే. ఇదండీ లేటు వెనుక అసలు స్టోరీ.

This post was last modified on August 24, 2024 10:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉచితాల‌తో `బ‌ద్ధ‌క‌స్తు`ల‌ను పెంచుతున్నారు: సుప్రీం సీరియ‌స్‌

``ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. స‌మాజంలో బ‌ద్ధ‌క‌స్తుల‌ను పెంచుతున్నాయి. ఇది స‌రికాదు. స‌మాజంలో ప‌నిచేసే వారు త‌గ్గిపోతున్నారు.…

1 minute ago

‘తండేల్’ బౌండరీ దాటలేకపోయినట్టేనా?

బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…

31 minutes ago

తులసిబాబుకు రూ.48 లక్షలు!.. ఎందుకిచ్చారంటే..?

కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…

1 hour ago

తమిళ స్టార్‌ను మనోళ్లే కాపాడాలి

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…

1 hour ago

విజిలెన్స్ రిపోర్ట్ రెడీ!… పెద్దిరెడ్డి ఆక్రమణలు నిజమేనా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…

2 hours ago

‘సైబర్ క్రైమ్’కు పృథ్వీరాజ్.. ఇంటరెస్టింగ్ కామెంట్స్

సినిమా ఫంక్షన్ లో వైసీపీని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్… బుధవారం…

3 hours ago