Trends

జూనియర్ డాక్టర్ హత్యాచారం ఎంత పాశవికమో చెబుతున్న రిపోర్టు

నిజానికి ఈ వార్త రాస్తున్నప్పుడు మనసు ఎంతో వేదనకు గురైంది. మనిషిలోని పశుత్వం కాదు.. పైశాచికత్వం ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టేలా ఉన్న వివరాలు చదువుతున్న కొద్దీ వణికిపోతున్న పరిస్థితి. ఎంత ఆటవికంగా.. మరెంత అమానుషంగా హత్యాచారానికి పాల్పడ్డారన్నది పోస్టు మార్టం రిపోర్టులోని వివరాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అవును.. మీరు ఊహించింది కరెక్టే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచారానికి సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న బాధితురాలిని హాస్పిటల్ లోనే హత్యాచారానికి పాల్పడటం.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన.. ఆందోళన వ్యక్తం కావటం తెలిసిందే. జూనియర్ డాక్టర్ గా రాత్రి వేళ విధులు నిర్వర్తించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆమె.. తర్వాతి రోజు ఉదయం సెమినార్ హాల్లో అర్థనగ్న స్థితిలో కనిపించటం.. ఆమెను చంపేసిన విధానం కడుపు తిప్పేలా ఉన్న సంగతి తెలిసిందే.

జూనియర్ డాక్టర్ హత్యాచారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు.. ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ.. ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. షాకింగ్ నిజం ఏమంటే.. తాజాగా ఆమె పోస్టుమార్టం రిపోర్టు కొత్త విషయాల్ని వెలుగులోకి వచ్చేలా చేసింది. ఆమెపై జరిగింది హత్యాచారం కాదని.. గ్యాంగ్ రేప్ తో పాటు చంపేశారన్న నిజం వెలుగు చూసింది.

అంతేకాదు.. ఆమె పోస్టుమార్టం రిపోర్టులోని అంశాలు చూస్తే.. ఆమెను ఎంత క్రూరంగా హింసించి చంపారో అర్థమవుతుంది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ తో పాటు కళ్లు.. నోటి నుంచి బ్లీడింగ్ కావటం.. ముఖం.. గోళ్లపై గాయాలు.. కడుపు.. ఎడమ కాలు.. మెడ.. కుడి చేయి.. పెదవులు.. చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడినట్లుగా వైద్యులు తమ రిపోర్టులో వెల్లడించారు.

ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లుగా పోస్టు మార్టం పేర్కొంది. దీని ప్రకారం చూస్తే.. ఆమెను ఒకరు కాకుండా గ్యాంగ్ రేప్ చేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులు కోర్టులో వేసిన కేసులో ఈ విషయాల్ని ప్రస్తావించినట్లుగా పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారం చేయటంతో పాటు.. ఆధారాలు మిగలకుండా ఉండేందుకు హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత.. ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరాన్ని ఇందులోని వివరాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. ఇంత క్రూరంగా హింసించిన వారు ఎవరైనా సరే.. కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూద్దాం.

This post was last modified on August 15, 2024 10:00 am

Share

Recent Posts

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

14 minutes ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

48 minutes ago

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

2 hours ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

3 hours ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

4 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

5 hours ago