ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లకు సంబంధించి అట్టుడుకుతున్న భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్లో కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమస్య సమసిపోయిందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా మరోసారి విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు రెచ్చిపోయాయి. రాజధాని ఢాకాలో మెరుపు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన మద్దతు దారులకు, సంఘాల నాయకులకు మధ్య వివాదం చెలరేగింది.
ఈ ఘర్షణల్లో ఇరు పక్షాలు దాడులు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 24 గంటల్లో 32 మందికిపై ఉద్యమ కారులు మృతి చెందినట్టు పేర్కొన్నారు. పదుల సంఖ్యలో నిరసన కారులు తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని.. ఎవరికీ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని.. అందరినీ ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేయాలని డిమాండ్లు తెరమీదికి వచ్చాయి.
అయితే… సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసేది లేదని, దీనిని కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిణామాలతోనే తాజాగా మరోసారి రగడ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అలెర్ట్ అయింది. బంగ్లాదేశంలోని ముఖ్యంగా ఢాకాలోని భారతీయ పౌరులు తమకు అందుబాటులో ఉండాలని కోరింది. పరిస్థితి విషమిస్తే.. ఏ క్షణంలో అయినా.. భారత్కు తిరిగి రావాలని.. దీనికి అన్ని విధాలా తమ సహకారం ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…