ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లకు సంబంధించి అట్టుడుకుతున్న భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్లో కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమస్య సమసిపోయిందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా మరోసారి విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు రెచ్చిపోయాయి. రాజధాని ఢాకాలో మెరుపు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన మద్దతు దారులకు, సంఘాల నాయకులకు మధ్య వివాదం చెలరేగింది.
ఈ ఘర్షణల్లో ఇరు పక్షాలు దాడులు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 24 గంటల్లో 32 మందికిపై ఉద్యమ కారులు మృతి చెందినట్టు పేర్కొన్నారు. పదుల సంఖ్యలో నిరసన కారులు తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని.. ఎవరికీ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని.. అందరినీ ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేయాలని డిమాండ్లు తెరమీదికి వచ్చాయి.
అయితే… సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసేది లేదని, దీనిని కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిణామాలతోనే తాజాగా మరోసారి రగడ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అలెర్ట్ అయింది. బంగ్లాదేశంలోని ముఖ్యంగా ఢాకాలోని భారతీయ పౌరులు తమకు అందుబాటులో ఉండాలని కోరింది. పరిస్థితి విషమిస్తే.. ఏ క్షణంలో అయినా.. భారత్కు తిరిగి రావాలని.. దీనికి అన్ని విధాలా తమ సహకారం ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.
This post was last modified on August 5, 2024 10:15 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…