Trends

బంగ్లాదేశ్‌లో మ‌ళ్లీ ర‌గ‌డ‌.. 24 గంట‌ల్లో 32 మంది మృతి?

ఉద్యోగాల విష‌యంలో రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి అట్టుడుకుతున్న భార‌త్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కొన్నాళ్ల కింద‌ట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో స‌మ‌స్య స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు. కానీ, అనూహ్యంగా మ‌రోసారి విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు రెచ్చిపోయాయి. రాజ‌ధాని ఢాకాలో మెరుపు స‌మ్మెకు దిగారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. దీంతో ప్ర‌ధాని షేక్ హ‌సీనా పార్టీకి చెందిన మ‌ద్ద‌తు దారుల‌కు, సంఘాల నాయ‌కుల‌కు మ‌ధ్య వివాదం చెల‌రేగింది.

ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో ఇరు ప‌క్షాలు దాడులు చేసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలో 24 గంట‌ల్లో 32 మందికిపై ఉద్య‌మ కారులు మృతి చెందిన‌ట్టు పేర్కొన్నారు. ప‌దుల సంఖ్య‌లో నిర‌స‌న కారులు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్టు తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాల‌ని.. ఎవ‌రికీ రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌డానికి వీల్లేద‌ని.. అంద‌రినీ ప్ర‌తిభ ఆధారంగానే ఉద్యోగాల‌కు ఎంపిక చేయాల‌ని డిమాండ్లు తెర‌మీదికి వ‌చ్చాయి.

అయితే… సుప్రీంకోర్టు తీర్పును ర‌ద్దు చేసేది లేద‌ని, దీనిని కొన‌సాగిస్తామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనిని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తోనే తాజాగా మ‌రోసారి ర‌గ‌డ చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ అలెర్ట్ అయింది. బంగ్లాదేశంలోని ముఖ్యంగా ఢాకాలోని భార‌తీయ పౌరులు త‌మ‌కు అందుబాటులో ఉండాల‌ని కోరింది. ప‌రిస్థితి విష‌మిస్తే.. ఏ క్ష‌ణంలో అయినా.. భార‌త్‌కు తిరిగి రావాల‌ని.. దీనికి అన్ని విధాలా త‌మ స‌హ‌కారం ఉంటుంద‌ని భార‌త్ స్ప‌ష్టం చేసింది.

This post was last modified on August 5, 2024 10:15 am

Share

Recent Posts

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

1 hour ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

4 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

4 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

5 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

7 hours ago