ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లకు సంబంధించి అట్టుడుకుతున్న భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్లో కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమస్య సమసిపోయిందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా మరోసారి విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు రెచ్చిపోయాయి. రాజధాని ఢాకాలో మెరుపు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన మద్దతు దారులకు, సంఘాల నాయకులకు మధ్య వివాదం చెలరేగింది.
ఈ ఘర్షణల్లో ఇరు పక్షాలు దాడులు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 24 గంటల్లో 32 మందికిపై ఉద్యమ కారులు మృతి చెందినట్టు పేర్కొన్నారు. పదుల సంఖ్యలో నిరసన కారులు తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని.. ఎవరికీ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని.. అందరినీ ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేయాలని డిమాండ్లు తెరమీదికి వచ్చాయి.
అయితే… సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసేది లేదని, దీనిని కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిణామాలతోనే తాజాగా మరోసారి రగడ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అలెర్ట్ అయింది. బంగ్లాదేశంలోని ముఖ్యంగా ఢాకాలోని భారతీయ పౌరులు తమకు అందుబాటులో ఉండాలని కోరింది. పరిస్థితి విషమిస్తే.. ఏ క్షణంలో అయినా.. భారత్కు తిరిగి రావాలని.. దీనికి అన్ని విధాలా తమ సహకారం ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.
This post was last modified on August 5, 2024 10:15 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…