Trends

బంగ్లాదేశ్‌లో మ‌ళ్లీ ర‌గ‌డ‌.. 24 గంట‌ల్లో 32 మంది మృతి?

ఉద్యోగాల విష‌యంలో రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి అట్టుడుకుతున్న భార‌త్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కొన్నాళ్ల కింద‌ట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో స‌మ‌స్య స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు. కానీ, అనూహ్యంగా మ‌రోసారి విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు రెచ్చిపోయాయి. రాజ‌ధాని ఢాకాలో మెరుపు స‌మ్మెకు దిగారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. దీంతో ప్ర‌ధాని షేక్ హ‌సీనా పార్టీకి చెందిన మ‌ద్ద‌తు దారుల‌కు, సంఘాల నాయ‌కుల‌కు మ‌ధ్య వివాదం చెల‌రేగింది.

ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో ఇరు ప‌క్షాలు దాడులు చేసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలో 24 గంట‌ల్లో 32 మందికిపై ఉద్య‌మ కారులు మృతి చెందిన‌ట్టు పేర్కొన్నారు. ప‌దుల సంఖ్య‌లో నిర‌స‌న కారులు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్టు తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాల‌ని.. ఎవ‌రికీ రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌డానికి వీల్లేద‌ని.. అంద‌రినీ ప్ర‌తిభ ఆధారంగానే ఉద్యోగాల‌కు ఎంపిక చేయాల‌ని డిమాండ్లు తెర‌మీదికి వ‌చ్చాయి.

అయితే… సుప్రీంకోర్టు తీర్పును ర‌ద్దు చేసేది లేద‌ని, దీనిని కొన‌సాగిస్తామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనిని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తోనే తాజాగా మ‌రోసారి ర‌గ‌డ చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ అలెర్ట్ అయింది. బంగ్లాదేశంలోని ముఖ్యంగా ఢాకాలోని భార‌తీయ పౌరులు త‌మ‌కు అందుబాటులో ఉండాల‌ని కోరింది. ప‌రిస్థితి విష‌మిస్తే.. ఏ క్ష‌ణంలో అయినా.. భార‌త్‌కు తిరిగి రావాల‌ని.. దీనికి అన్ని విధాలా త‌మ స‌హ‌కారం ఉంటుంద‌ని భార‌త్ స్ప‌ష్టం చేసింది.

This post was last modified on August 5, 2024 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

31 minutes ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

1 hour ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

2 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

3 hours ago

‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్

తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…

4 hours ago

నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?

జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…

5 hours ago