ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లకు సంబంధించి అట్టుడుకుతున్న భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్లో కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమస్య సమసిపోయిందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా మరోసారి విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు రెచ్చిపోయాయి. రాజధాని ఢాకాలో మెరుపు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన మద్దతు దారులకు, సంఘాల నాయకులకు మధ్య వివాదం చెలరేగింది.
ఈ ఘర్షణల్లో ఇరు పక్షాలు దాడులు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 24 గంటల్లో 32 మందికిపై ఉద్యమ కారులు మృతి చెందినట్టు పేర్కొన్నారు. పదుల సంఖ్యలో నిరసన కారులు తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని.. ఎవరికీ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని.. అందరినీ ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేయాలని డిమాండ్లు తెరమీదికి వచ్చాయి.
అయితే… సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసేది లేదని, దీనిని కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిణామాలతోనే తాజాగా మరోసారి రగడ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అలెర్ట్ అయింది. బంగ్లాదేశంలోని ముఖ్యంగా ఢాకాలోని భారతీయ పౌరులు తమకు అందుబాటులో ఉండాలని కోరింది. పరిస్థితి విషమిస్తే.. ఏ క్షణంలో అయినా.. భారత్కు తిరిగి రావాలని.. దీనికి అన్ని విధాలా తమ సహకారం ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.
This post was last modified on August 5, 2024 10:15 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…