2008 నవంబర్ 26 నుండి 29 వరకు ముంబయి మహానగరంపై మూడు రోజుల పాటు ఉగ్రవాదులు చేసిన దాడుల గురించి అందరికీ తెలిసిందే. ఈ దాడులలో 173 మంది చనిపోగా, మూడు వందల మందికి పైగా గాయపడ్డారు. అయితే అక్కడ దాడుల నేపథ్యంలో కొందరు సినిమా పరిశ్రమకు చెందిన వారు వచ్చి ఆ దృశ్యాలను చిత్రీకరించడం, అక్కడ విషాదం నెలకొన్న సమయంలోనే తాము సినిమా తీస్తామని ప్రకటించడం విమర్శలకు దారి తీసింది.
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తుతో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలకు గ్రామాలను తుడిచిపెట్టింది. ముండక్కై, చూరాల్ మల ప్రాంతాలలో 65 శాతం ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాలను తొలగిస్తే గానీ చనిపోయిన వారు ఎంత మంది అన్న విషయం తెలిసేలా లేదు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనూ ఆర్మీ, పోలీసు బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా స్థానికులను కాపాడారు. ఈ నేపథ్యంలో డార్క్ టూరిజం మీద కేరళ పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ పరిస్థితులలో అక్కడికి ఎవరైనా రావద్దని మీడియా, సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేస్తున్నారు.
విపత్తులు, యుద్దం, దాడులు, మరణాలు జరిగిన ప్రాంతాలలో పర్యటించి వీడియోలు, ఫోటోలు సేకరించడాన్ని డార్క్ టూరిజం అంటారు. ఇలాంటి వారు ఎవరూ కేరళలో విపత్తు జరిగిన ప్రాంతాలకు రావద్దని స్పష్టం చేశారు. వీరి రాక మూలంగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు ఆటంకం జరుగుతుందని చెబుతున్నారు. సోషల్ మీడియా పరిధి పెరిగిన నేపథ్యంలో అనేక వ్లాగర్లు ఇలాంటి వాటిని కూడా తీసి యూట్యూబ్, ఇన్ స్టా తదితర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తుంటారు. అందుకే అలాంటి వారు రావద్దని పోలీసులు చెబుతున్నారు. మన తెలుగు సామెత ప్రకారం చెప్పాలంటే వీళ్లంతా ‘శవాల మీద పేలాలు ఏరుకునే’ బ్యాచ్ అన్నమాట.
This post was last modified on August 2, 2024 10:45 am
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…