17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా టీ20 ప్రపంచ కప్ సాధించింది. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో సఫారీ జట్టుపై భారత్ 7 పరుగుల తేడాతో చరిత్రాత్మక విజయం సాధించింది.
ఈ హైటెన్షన్ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న కింగ్ కోహ్లీ ఈ రోజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లీకి అక్షర్ పటేల్ 47, శివమ్ దూబే 27ల నుంచి సహకారం లభించింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సఫారీ బ్యాట్స్ మన్లలో హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 57 పరుగులతో వీర విహారం చేశాడు. అయితే, క్లాసెన్ ను హార్దిక్ పాండ్యా అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిరిగింది. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన సందర్భంగా హార్దిక్ పాండ్యా మ్యాజిక్ చేశాడు. తొలి బంతికి మిల్లర్ వికెట్ తో పాటు మరో వికెట్ తీసిన పాండ్యా 8 పరుగులే ఇవ్వడంతో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ టైటిల్ ను రెండు సార్లు గెలుచుకున్న మూడో జట్టుగా భారత్ అవతరించింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ ల సరసన భారత్ చేరింది. 2007లో ధోనీ నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవగా 17 ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో కప్ గెలిచారు. 2014 టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ చేరినా శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది.
This post was last modified on June 30, 2024 10:17 am
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…