అమెరికా, వెస్టిండీస్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో సంచలనం నమోదైంది. ప్రపంచ క్రికెట్ లో బలమైన జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను సూపర్-8 మ్యాచ్ లో ఓడించిన అప్ఘానిస్థాన్ జట్టు…తాజాగా ఆసీస్ ను టోర్నమెంట్ నుంచి బయటకు పంపి సెమీస్ కు చేరింది. బంగ్లాదేశ్ తే జరిగిన సూపర్-8 దశలోని చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అప్ఘాన్ జట్టు అద్భుత విజయం సాధించి సెమీస్ కు దూసుకువెళ్లింది.
నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో విజయం చివరి ఓవర్ వరకు ఇరు జట్లతో దోబూచులాడింది. మధ్యలో పలుమార్లు వర్షం అంతరాయం కల్గించినప్పటికీ ఈ నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో అప్ఘాన్ జట్టు ఒత్తిడిని తట్టుకొని అప్ఘాన్ నిలబడగలిగింది. బంగ్లా బ్యాట్స్ మన్ లిట్టన్ దాస్ అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచినా తన జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌలింగ్ కు సహకరిస్తున్న స్లో పిచ్ పై అప్ఘాన్ ఓపెనర్ గుర్బాజ్(43) మినహా మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిట్టన్ దాస్(54) అజేయ అర్థ సెంచరీతో ఒంటరిపోరాటం చేసినా ఫలితం దక్కలేదు. 8 వికెట్లు కోల్పోయిన బంగ్లా విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు కావాలన్న దశలో బౌలింగ్ వేసిన నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తీసి బంగ్లాను ఆలౌట్ చేశాడు.
దీంతో, తొలిసారి అఫ్ఘాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ సెమీస్ కు చేరి ఆస్ట్రేలియాను ఇంటి దారి పట్టించింది. ఇప్పటికే ఈ గ్రూప్ లో మొదటి స్థానంలో ఉన్న ఇండియా సెమీస్ కు చేరగా అప్ఘాన్ రెండో స్థానంలో నిలిచి సెమీస్ లో అడుగెపెట్టింది. ఈ నెల 27న జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా జట్టుతో అప్ఘానిస్థాన్ తలపడనుంది. ఈ రెండు జట్లు ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీని ఇప్పటి దాకా అందుకోలేదు. అదే రోజున జరగనున్న రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత్ తలపడనుంది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…