అమెరికా, వెస్టిండీస్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో సంచలనం నమోదైంది. ప్రపంచ క్రికెట్ లో బలమైన జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను సూపర్-8 మ్యాచ్ లో ఓడించిన అప్ఘానిస్థాన్ జట్టు…తాజాగా ఆసీస్ ను టోర్నమెంట్ నుంచి బయటకు పంపి సెమీస్ కు చేరింది. బంగ్లాదేశ్ తే జరిగిన సూపర్-8 దశలోని చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అప్ఘాన్ జట్టు అద్భుత విజయం సాధించి సెమీస్ కు దూసుకువెళ్లింది.
నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో విజయం చివరి ఓవర్ వరకు ఇరు జట్లతో దోబూచులాడింది. మధ్యలో పలుమార్లు వర్షం అంతరాయం కల్గించినప్పటికీ ఈ నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో అప్ఘాన్ జట్టు ఒత్తిడిని తట్టుకొని అప్ఘాన్ నిలబడగలిగింది. బంగ్లా బ్యాట్స్ మన్ లిట్టన్ దాస్ అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచినా తన జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌలింగ్ కు సహకరిస్తున్న స్లో పిచ్ పై అప్ఘాన్ ఓపెనర్ గుర్బాజ్(43) మినహా మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిట్టన్ దాస్(54) అజేయ అర్థ సెంచరీతో ఒంటరిపోరాటం చేసినా ఫలితం దక్కలేదు. 8 వికెట్లు కోల్పోయిన బంగ్లా విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు కావాలన్న దశలో బౌలింగ్ వేసిన నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తీసి బంగ్లాను ఆలౌట్ చేశాడు.
దీంతో, తొలిసారి అఫ్ఘాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ సెమీస్ కు చేరి ఆస్ట్రేలియాను ఇంటి దారి పట్టించింది. ఇప్పటికే ఈ గ్రూప్ లో మొదటి స్థానంలో ఉన్న ఇండియా సెమీస్ కు చేరగా అప్ఘాన్ రెండో స్థానంలో నిలిచి సెమీస్ లో అడుగెపెట్టింది. ఈ నెల 27న జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా జట్టుతో అప్ఘానిస్థాన్ తలపడనుంది. ఈ రెండు జట్లు ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీని ఇప్పటి దాకా అందుకోలేదు. అదే రోజున జరగనున్న రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత్ తలపడనుంది.
This post was last modified on June 25, 2024 12:14 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…