80, 90 దశకాల్లో కల్తీ సారా తాలూకు దారుణాల గురించి తరచుగా వార్తలు వినేవాళ్లం. మద్యం చాలినంత స్థాయిలో జనాలకు అందక, లేదా ఆంక్షల వల్ల అప్పట్లో కల్తీ సారా తాగి జనాలు ప్రాణాలు కోల్పోయేవాళ్లు. కానీ ఇప్పుడు దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో మద్యం ఏరులై పోరుతోంది. చీప్ లిక్కర్ దగ్గర్నుంచి టాప్ బ్రాండ్స్ వరకు అన్ని రకాల మద్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటి రోజుల్లో కల్తీ సారా తాగి 29 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాట తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగి 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముందుగా అందులో ఆరుగురు చనిపోయారు. తర్వాత ఆసుపత్రి పాలైన వాళ్లలో ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోవడం మొదలైంది.
మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి గురువారం ఉదయానికి 29కి చేరుకుంది. మిగతా వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంటున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో చికిత్స జరుగుతున్న ఆసుపత్రి ప్రాంగణం దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. మృతులు, ఇతర బాధితులు స్థానికంగా తయారయ్యే సారా తాగి అస్వస్థతకు గురయ్యారు.
మద్యం తాగి కింద పడి దొర్లుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్పై బదిలీ వేటు వేయగా.. ఎస్పీ సమయసింగ్ మీనా మీద సస్పెన్షన్ విధించారు.
This post was last modified on June 20, 2024 11:08 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…