80, 90 దశకాల్లో కల్తీ సారా తాలూకు దారుణాల గురించి తరచుగా వార్తలు వినేవాళ్లం. మద్యం చాలినంత స్థాయిలో జనాలకు అందక, లేదా ఆంక్షల వల్ల అప్పట్లో కల్తీ సారా తాగి జనాలు ప్రాణాలు కోల్పోయేవాళ్లు. కానీ ఇప్పుడు దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో మద్యం ఏరులై పోరుతోంది. చీప్ లిక్కర్ దగ్గర్నుంచి టాప్ బ్రాండ్స్ వరకు అన్ని రకాల మద్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటి రోజుల్లో కల్తీ సారా తాగి 29 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాట తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగి 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముందుగా అందులో ఆరుగురు చనిపోయారు. తర్వాత ఆసుపత్రి పాలైన వాళ్లలో ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోవడం మొదలైంది.
మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి గురువారం ఉదయానికి 29కి చేరుకుంది. మిగతా వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంటున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో చికిత్స జరుగుతున్న ఆసుపత్రి ప్రాంగణం దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. మృతులు, ఇతర బాధితులు స్థానికంగా తయారయ్యే సారా తాగి అస్వస్థతకు గురయ్యారు.
మద్యం తాగి కింద పడి దొర్లుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్పై బదిలీ వేటు వేయగా.. ఎస్పీ సమయసింగ్ మీనా మీద సస్పెన్షన్ విధించారు.
This post was last modified on June 20, 2024 11:08 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…