కరోనా ధాటికి ఇండియాలో లాక్ డౌన్ అమలవడంతో రెండు నెలల పాటు అన్నీ మూతపడ్డాయి. ఆ తర్వాత లాక్ డౌన్ షరతుల్ని ఒక్కొక్కటిగా సడలిస్తూ వచ్చారు. వివిధ వ్యాపారాలు పున:ప్రారంభమయ్యాయి. యధావిధిగా నడుస్తున్నాయి. ఐతే కొన్నింటి మీద మాత్రం నిషేధం కొనసాగుతోంది. థియేటర్లకు ఇంకా అనుమతులు రాలేదు.
బార్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.. రాష్ట్రాలు వాటి మీద నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నాయి. ఆ రంగంలోని వాళ్లు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. బయట వైన్ షాపులను నాలుగు నెలల ముందే తెరిచేసి.. బార్లకు మాత్రం అనుమతులు ఇవ్వకపోవడం పట్ల వాటిని నమ్ముకున్న వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు బార్ల మీద నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ వారాంతం నుంచే అక్కడ బార్లు నడుస్తున్నాయి.
సరిగ్గా ఐపీఎల్ ఆరంభమైన సమయంలోనే ఏపీలో బార్లు తెరుచుకోవడం విశేషం. సాయంత్రం పూట బార్లలో తిష్ట వేసి ఐపీఎల్ చూడటం మందుబాబులకు మంచి కిక్కిస్తుంది. ఐపీఎల్ టైంలో బార్ల వ్యాపారం ఓ రేంజిలో జరుగుతుంది. మామూలుగానే వేసవిలో బార్లకు వచ్చి చిల్ అయ్యేవాళ్లు ఎక్కువ. ఆ టైంలో ఐపీఎల్ కూడా తోడైతే వాళ్ల ఆనందానికి అవధులుండవు. మందుకొడుతూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ, బెట్టింగులు కడుతూ మూడు గంటల పాటు కాలక్షేపం చేస్తారు.
ఐతే కరోనా కారణంగా లేటుగా, యూఏఈలో ఐపీఎల్ ఆరంభం కాగా.. ఈ టైంలో బార్లు తెరవకపోవడం ఆ రంగానికి తీవ్ర నష్టం తెచ్చిపెట్టేదే. మందు బాబులూ వాటిని మిస్సవుతారు. అందుకే ఆదాయ కోణంలో చూసి ఏపీ ప్రభుత్వం వాటికి అనుమతులు ఇచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఆలస్యం చేయకుండా మరి కొన్ని రోజుల్లోనే బార్లకు అనుమతులు ఇవ్వబోతోందని.. వచ్చే వీకెండ్లో క్రికెట్ ప్రియులు బార్లలో ఐపీఎల్ ఎంజాయ్ చేస్తూ మందుకొట్టొచ్చని సమాచారం.
This post was last modified on September 20, 2020 2:20 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…