కరోనా ధాటికి ఇండియాలో లాక్ డౌన్ అమలవడంతో రెండు నెలల పాటు అన్నీ మూతపడ్డాయి. ఆ తర్వాత లాక్ డౌన్ షరతుల్ని ఒక్కొక్కటిగా సడలిస్తూ వచ్చారు. వివిధ వ్యాపారాలు పున:ప్రారంభమయ్యాయి. యధావిధిగా నడుస్తున్నాయి. ఐతే కొన్నింటి మీద మాత్రం నిషేధం కొనసాగుతోంది. థియేటర్లకు ఇంకా అనుమతులు రాలేదు.
బార్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.. రాష్ట్రాలు వాటి మీద నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నాయి. ఆ రంగంలోని వాళ్లు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. బయట వైన్ షాపులను నాలుగు నెలల ముందే తెరిచేసి.. బార్లకు మాత్రం అనుమతులు ఇవ్వకపోవడం పట్ల వాటిని నమ్ముకున్న వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు బార్ల మీద నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ వారాంతం నుంచే అక్కడ బార్లు నడుస్తున్నాయి.
సరిగ్గా ఐపీఎల్ ఆరంభమైన సమయంలోనే ఏపీలో బార్లు తెరుచుకోవడం విశేషం. సాయంత్రం పూట బార్లలో తిష్ట వేసి ఐపీఎల్ చూడటం మందుబాబులకు మంచి కిక్కిస్తుంది. ఐపీఎల్ టైంలో బార్ల వ్యాపారం ఓ రేంజిలో జరుగుతుంది. మామూలుగానే వేసవిలో బార్లకు వచ్చి చిల్ అయ్యేవాళ్లు ఎక్కువ. ఆ టైంలో ఐపీఎల్ కూడా తోడైతే వాళ్ల ఆనందానికి అవధులుండవు. మందుకొడుతూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ, బెట్టింగులు కడుతూ మూడు గంటల పాటు కాలక్షేపం చేస్తారు.
ఐతే కరోనా కారణంగా లేటుగా, యూఏఈలో ఐపీఎల్ ఆరంభం కాగా.. ఈ టైంలో బార్లు తెరవకపోవడం ఆ రంగానికి తీవ్ర నష్టం తెచ్చిపెట్టేదే. మందు బాబులూ వాటిని మిస్సవుతారు. అందుకే ఆదాయ కోణంలో చూసి ఏపీ ప్రభుత్వం వాటికి అనుమతులు ఇచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఆలస్యం చేయకుండా మరి కొన్ని రోజుల్లోనే బార్లకు అనుమతులు ఇవ్వబోతోందని.. వచ్చే వీకెండ్లో క్రికెట్ ప్రియులు బార్లలో ఐపీఎల్ ఎంజాయ్ చేస్తూ మందుకొట్టొచ్చని సమాచారం.
This post was last modified on September 20, 2020 2:20 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…