Trends

కరోనా పంచ్.. రెండు పోలీస్ స్టేషన్లను మూసేశారు

కరోనా పుణ్యమా అని ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులోని రెండు పోలీస్ స్టేషన్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు స్టేషన్ల పరిధిలో ఆరుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది.

ప్రజల్ని కాపాడేందుకు అహరహం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ బారిన పడటంతో.. మిగిలిన సిబ్బందిని రక్షించుకునే క్రమంలో రెండు స్టేషన్లను మూసివేశారు. సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ కు పంపించారు.

కోయంబత్తూరు సమీపంలోని పొదనూర్.. కునియాముత్తూర్ స్టేషన్లలో పని చేసే ఆరుగురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉలిక్కిపడిన ఉన్నతాధికారులు.. రెండు స్టేషన్లలో పని చేసే 105 మంది పోలీసు సిబ్బందికి ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారందరికి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది.

అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వారందరిని క్వారంటైన్ కు పంపి.. రెండు స్టేషన్లను మూసివేయాలని నిర్ణయించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తొలినాళ్లలో తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. కేరళలో కేసులు పెద్ద ఎత్తున నమోదైన వేళ.. తమిళనాడులో నామమాత్రంగా కేసుల నమోదు ఉండేది.

ఇలాంటి పరిస్థితి నుంచి.. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయిన దుస్థితిలో తమిళనాడులో చోటు చేసుకుంది. ఇప్పుడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1821కు చేరగా.. వారిలో 900 మంది కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణాదిన మరే రాష్ట్రంలో లేని రీతిలో తమిళనాడులో ఇప్పటివరకూ 96 మంది పోలీసులు కరోనా బారిన పడటం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో మరెక్కడా లేని రీతిలో పెద్ద సంఖ్యలో పోలీసు శాఖకు చెందిన వారు కరోనా పాజిటివ్ గా తేలిన చెత్త రికార్డు తమిళనాడు సొంతంగా చెప్పాలి.

This post was last modified on April 27, 2020 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

18 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago