Trends

కరోనా పంచ్.. రెండు పోలీస్ స్టేషన్లను మూసేశారు

కరోనా పుణ్యమా అని ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులోని రెండు పోలీస్ స్టేషన్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు స్టేషన్ల పరిధిలో ఆరుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది.

ప్రజల్ని కాపాడేందుకు అహరహం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ బారిన పడటంతో.. మిగిలిన సిబ్బందిని రక్షించుకునే క్రమంలో రెండు స్టేషన్లను మూసివేశారు. సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ కు పంపించారు.

కోయంబత్తూరు సమీపంలోని పొదనూర్.. కునియాముత్తూర్ స్టేషన్లలో పని చేసే ఆరుగురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉలిక్కిపడిన ఉన్నతాధికారులు.. రెండు స్టేషన్లలో పని చేసే 105 మంది పోలీసు సిబ్బందికి ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారందరికి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది.

అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వారందరిని క్వారంటైన్ కు పంపి.. రెండు స్టేషన్లను మూసివేయాలని నిర్ణయించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తొలినాళ్లలో తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. కేరళలో కేసులు పెద్ద ఎత్తున నమోదైన వేళ.. తమిళనాడులో నామమాత్రంగా కేసుల నమోదు ఉండేది.

ఇలాంటి పరిస్థితి నుంచి.. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయిన దుస్థితిలో తమిళనాడులో చోటు చేసుకుంది. ఇప్పుడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1821కు చేరగా.. వారిలో 900 మంది కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణాదిన మరే రాష్ట్రంలో లేని రీతిలో తమిళనాడులో ఇప్పటివరకూ 96 మంది పోలీసులు కరోనా బారిన పడటం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో మరెక్కడా లేని రీతిలో పెద్ద సంఖ్యలో పోలీసు శాఖకు చెందిన వారు కరోనా పాజిటివ్ గా తేలిన చెత్త రికార్డు తమిళనాడు సొంతంగా చెప్పాలి.

This post was last modified on April 27, 2020 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

2 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

2 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

7 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

9 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

12 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

13 hours ago