Trends

కరోనా పంచ్.. రెండు పోలీస్ స్టేషన్లను మూసేశారు

కరోనా పుణ్యమా అని ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులోని రెండు పోలీస్ స్టేషన్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు స్టేషన్ల పరిధిలో ఆరుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది.

ప్రజల్ని కాపాడేందుకు అహరహం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ బారిన పడటంతో.. మిగిలిన సిబ్బందిని రక్షించుకునే క్రమంలో రెండు స్టేషన్లను మూసివేశారు. సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ కు పంపించారు.

కోయంబత్తూరు సమీపంలోని పొదనూర్.. కునియాముత్తూర్ స్టేషన్లలో పని చేసే ఆరుగురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉలిక్కిపడిన ఉన్నతాధికారులు.. రెండు స్టేషన్లలో పని చేసే 105 మంది పోలీసు సిబ్బందికి ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారందరికి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది.

అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వారందరిని క్వారంటైన్ కు పంపి.. రెండు స్టేషన్లను మూసివేయాలని నిర్ణయించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తొలినాళ్లలో తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. కేరళలో కేసులు పెద్ద ఎత్తున నమోదైన వేళ.. తమిళనాడులో నామమాత్రంగా కేసుల నమోదు ఉండేది.

ఇలాంటి పరిస్థితి నుంచి.. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయిన దుస్థితిలో తమిళనాడులో చోటు చేసుకుంది. ఇప్పుడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1821కు చేరగా.. వారిలో 900 మంది కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణాదిన మరే రాష్ట్రంలో లేని రీతిలో తమిళనాడులో ఇప్పటివరకూ 96 మంది పోలీసులు కరోనా బారిన పడటం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో మరెక్కడా లేని రీతిలో పెద్ద సంఖ్యలో పోలీసు శాఖకు చెందిన వారు కరోనా పాజిటివ్ గా తేలిన చెత్త రికార్డు తమిళనాడు సొంతంగా చెప్పాలి.

This post was last modified on April 27, 2020 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

48 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago