Trends

కరోనా పంచ్.. రెండు పోలీస్ స్టేషన్లను మూసేశారు

కరోనా పుణ్యమా అని ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులోని రెండు పోలీస్ స్టేషన్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు స్టేషన్ల పరిధిలో ఆరుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది.

ప్రజల్ని కాపాడేందుకు అహరహం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ బారిన పడటంతో.. మిగిలిన సిబ్బందిని రక్షించుకునే క్రమంలో రెండు స్టేషన్లను మూసివేశారు. సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ కు పంపించారు.

కోయంబత్తూరు సమీపంలోని పొదనూర్.. కునియాముత్తూర్ స్టేషన్లలో పని చేసే ఆరుగురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉలిక్కిపడిన ఉన్నతాధికారులు.. రెండు స్టేషన్లలో పని చేసే 105 మంది పోలీసు సిబ్బందికి ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారందరికి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది.

అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వారందరిని క్వారంటైన్ కు పంపి.. రెండు స్టేషన్లను మూసివేయాలని నిర్ణయించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తొలినాళ్లలో తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. కేరళలో కేసులు పెద్ద ఎత్తున నమోదైన వేళ.. తమిళనాడులో నామమాత్రంగా కేసుల నమోదు ఉండేది.

ఇలాంటి పరిస్థితి నుంచి.. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయిన దుస్థితిలో తమిళనాడులో చోటు చేసుకుంది. ఇప్పుడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1821కు చేరగా.. వారిలో 900 మంది కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణాదిన మరే రాష్ట్రంలో లేని రీతిలో తమిళనాడులో ఇప్పటివరకూ 96 మంది పోలీసులు కరోనా బారిన పడటం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో మరెక్కడా లేని రీతిలో పెద్ద సంఖ్యలో పోలీసు శాఖకు చెందిన వారు కరోనా పాజిటివ్ గా తేలిన చెత్త రికార్డు తమిళనాడు సొంతంగా చెప్పాలి.

This post was last modified on April 27, 2020 4:11 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

41 mins ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

1 hour ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

2 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

2 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

3 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

4 hours ago