2009 సెప్టెంబరులో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ప్రతికూల వాతావరణ పరిస్థితిని ముందుగా అంచనా వేయలేక పోవడంతోపాటు.. దట్టమైన అటవీ మార్గంలో హెలికా ప్టర్ ప్రయాణించడంతో ఆనాడు.. ఘోర ప్రమాదం సంభవించింది. నాటి వైఎస్ ఘటన.. నేటికీ చర్చకు వస్తూనే ఉంది. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా మన పొరుగు దేశం ఇరాన్లో చోటు చేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు.. ఇబ్రహీం రైసీ తన మంత్రివర్గంలోని కొందరితో కలిసి.. అజర్ బైజాన్కు వెళ్లారు. మొత్తం మూడు హెలికాప్టర్లలో వీరు ప్రయాణించారు.
అయితే.. అనూహ్యంగా వాతవరణంలో చోటు చేసుకున్న మార్పులతో గాలి, వర్షం కురిసింది. దీంతో హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుని.. ఒక్కసారిగా కూలిపోయింది. తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లోని జోల్ఫా నగరానికి సమీపంలో ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పలిపోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన వెంట ఉన్న మంత్రుల హెలికాప్టర్లు కూడా.. కూలిపోయాయని పేర్కొన్నాయి. అధ్యక్షుడు ఇబ్రహీంతో పాటు విదేశాంగశాఖ మంత్రి హోసేన్ అమిర్ అబ్దోల్లాహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ సహా పలువురు అధికారులు ఆయా హెలికాప్టర్లలో ప్రయాణించారు.
ఊహించని ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రమాదానికి చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోందని చెప్పారు. ఇక, అధ్యక్షుడి హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిన వెంటనే.. 40 ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ రిలీఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే.. ఈ గాలింపు చర్యలకు కూడా పొగ మంచు, వర్షాలతో కూడిన ప్రతికూల వాతావరణం ఇబ్బందిగా మారినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఘటన జరిగి గంటలు గడిచినా.. అధ్యక్షుడి జాడ తెలియకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆయన ప్రాణాలతో ఉన్నారా? లేరా? అనేది ఉత్కంఠగా మారింది. దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
మోడీ దిగ్భ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి అయిన విషయం తనను ఎంతో కలచి వేసిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆయన ఈ ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ విపత్కర సమయంలో ఇరాన్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇబ్రహీం క్షేమంగా ఉండాలని.. తిరిగి తనపాలనను కొనసాగించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్టు మోడీ పేర్కొన్నారు.
This post was last modified on May 20, 2024 10:07 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…