Trends

వైఎస్ ఘ‌ట‌న‌ను గుర్తు చేసిన… ఇరాన్ అధ్య‌క్షుడి ప్ర‌మాదం!

2009 సెప్టెంబ‌రులో ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చనిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌తికూల వాతావర‌ణ ప‌రిస్థితిని ముందుగా అంచ‌నా వేయ‌లేక పోవ‌డంతోపాటు.. ద‌ట్ట‌మైన‌ అట‌వీ మార్గంలో హెలికా ప్ట‌ర్ ప్ర‌యాణించ‌డంతో ఆనాడు.. ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. నాటి వైఎస్ ఘ‌ట‌న‌.. నేటికీ చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా మ‌న పొరుగు దేశం ఇరాన్‌లో చోటు చేసుకుంది. ఇరాన్ అధ్య‌క్షుడు.. ఇబ్ర‌హీం రైసీ త‌న మంత్రివ‌ర్గంలోని కొంద‌రితో క‌లిసి.. అజ‌ర్ బైజాన్‌కు వెళ్లారు. మొత్తం మూడు హెలికాప్ట‌ర్ల‌లో వీరు ప్ర‌యాణించారు.

అయితే.. అనూహ్యంగా వాత‌వ‌ర‌ణంలో చోటు చేసుకున్న మార్పుల‌తో గాలి, వ‌ర్షం కురిసింది. దీంతో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చిక్కుకుని.. ఒక్క‌సారిగా కూలిపోయింది. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌ లోని జోల్ఫా నగరానికి సమీపంలో ఇబ్రహీం రైసీ ప్ర‌యాణిస్తున్న హెలికాప్టర్ కుప్ప‌లిపోయిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఆయ‌న వెంట ఉన్న మంత్రుల హెలికాప్ట‌ర్లు కూడా.. కూలిపోయాయ‌ని పేర్కొన్నాయి. అధ్యక్షుడు ఇబ్రహీంతో పాటు విదేశాంగశాఖ మంత్రి హోసేన్‌ అమిర్ అబ్దోల్లాహియన్‌, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్ స‌హా ప‌లువురు అధికారులు ఆయా హెలికాప్ట‌ర్ల‌లో ప్ర‌యాణించారు.

ఊహించ‌ని ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్ట‌ర్‌ ప్రమాదానికి చిక్కుకున్న‌ట్టు అధికారులు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో భారీ ఈదురు గాలులతో కూడిన‌ వర్షం కురుస్తోందని చెప్పారు. ఇక‌, అధ్య‌క్షుడి హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన విష‌యం తెలిసిన వెంట‌నే.. 40 ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ రిలీఫ్ బృందాలు గాలింపు చర్యలు చేప‌ట్టాయి. అయితే.. ఈ గాలింపు చ‌ర్య‌ల‌కు కూడా పొగ మంచు, వర్షాలతో కూడిన‌ ప్రతికూల వాతావరణం ఇబ్బందిగా మారిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఘ‌ట‌న జ‌రిగి గంట‌లు గ‌డిచినా.. అధ్య‌క్షుడి జాడ తెలియ‌క‌పోవ‌డంతో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఆయ‌న ప్రాణాల‌తో ఉన్నారా? లేరా? అనేది ఉత్కంఠ‌గా మారింది. దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

మోడీ దిగ్భ్రాంతి

ఇరాన్ అధ్య‌క్షుడు ఇబ్ర‌హీం రైసీ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురి అయిన విష‌యం త‌న‌ను ఎంతో క‌ల‌చి వేసింద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. ఆయ‌న ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఇరాన్ ప్ర‌జ‌ల‌కు భార‌త్ అండ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇబ్ర‌హీం క్షేమంగా ఉండాల‌ని.. తిరిగి త‌న‌పాల‌న‌ను కొన‌సాగించాల‌ని భ‌గ‌వంతుడిని వేడుకుంటున్న‌ట్టు మోడీ పేర్కొన్నారు.

This post was last modified on May 20, 2024 10:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

4 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

6 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

14 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

16 hours ago