Trends

ఖమ్మం టీడీపీ ఆఫీసుకు పెరిగిన డిమాండ్ !

తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి అక్కడ గిరాకీ తగ్గడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని నేరుగా కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఆ పార్టీ కార్యాలయానికి అందరూ క్యూ కట్టారు. ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయం చుట్టూ ఖమ్మం లోక్ సభ అభ్యర్థులు క్యూ కట్టారు. దీంతో వారు ఎవరికి మద్దతు పలుకుతారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు ఖమ్మంలో కాంగ్రెస్ వెంట నడిచాయి. చంద్రబాబు, రేవంత్ ఫ్యాక్టరీ దీనికి దోహదం చేసింది. దీంతో గెలిచిన తర్వాత మంత్రులు పొంగులేటి, తుమ్మలను టీడీపీ ఆఫీసుకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుండి రామసహాయం రఘురామిరెడ్డి, బీఆర్ఎస్ నుండి నామా నాగేశ్వర్ రావు, బీజేపీ నుండి వినోద్ రావులు పోటీకి దిగారు. వీరంతా ఇప్పుడు టీడీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

గత ఎన్నికల మాదిరిగానే మళ్లీ తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు టీడీపీని కోరారు. అయితే కాంగ్రెస్ నుండి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తారనుకుంటే మొండి చేయి చూపారని వారు గుర్రుగా ఉన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేపథ్యంలో ఇక్కడ తనకు మద్దతు ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి వినోద్ రావు తిరుగుతున్నాడు.

రేపో, మాపో చంద్రబాబునాయుడు తెలంగాణలో టీడీపీ మద్దతు బీజేపీకే అని ప్రకటన చేయనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు కూడా టీడీపీ మద్దతు ఆశిస్తూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. కమ్మ సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. అక్కడ మంత్రులు పొంగులేటి, తుమ్మలల మధ్య విభేదాలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి కలిసి వస్తున్నట్లు చెబుతున్నారు. ఆఖరుకు టీడీపీ శ్రేణులు ఎటు వైపు మొగ్గు చూపుతాయో వేచిచూడాలి.

This post was last modified on May 9, 2024 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

49 minutes ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

2 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

3 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

4 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

6 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

8 hours ago