Trends

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య ఆలియాస్ దర్శనం మొగులయ్య ప్రస్తుతం పూట గడిచేందుకు దినసరికూలీగా మారాడు. హైదరాబాద్ లోని తుర్కయంజాల్ సమీపంలో ఓ నిర్మాణస్థలంలో పనిచేస్తున్న మొగులయ్య వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగర్ కర్నూలు  జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య  52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శనలను ఇచ్చాడు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకోగా, భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 

తెలంగాణ ప్రభుత్వం నుండి నెలవారీగా వస్తున్న రూ.10 వేల ఫించన్ ఆగిపోవడంతో మొగులయ్య కూలీ పనులకు వెళ్తున్నట్లు చెబుతున్నాడు. మొగులయ్య, కొడుకుల్లో ఒకరు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. తన కొడుకు అవసరాల కోసం నెలకు రూ.7 వేలు కావాలని, ప్రభుత్వం నుండి వచ్చే గౌరవ వేతనం ఎందుకు ఆగిందో తనకు తెలియదని మొగులయ్య అన్నాడు. మొగులయ్య పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ కూడా పాడడం విశేషం.

కిన్నెర గాయకుడు మొగులయ్యకు నటుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో పాడే అవకాశం ఇవ్వడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. గతంలో ఆయన అనారోగ్యానికి గురైనపుడు పలువురు ఆర్ధిక సాయం అందించడంతో కోలుకున్నారు. ప్రస్తుతం ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో కూలీ పనులు చేసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 వేలు గౌరవ వేతనం ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.

This post was last modified on May 3, 2024 5:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైలులో ఉన్న హీరో అంటే ఇంత పిచ్చి ఉందా

స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడం నిజమేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. స్వంత అభిమానిని హత్య చేసిన కేసులో…

1 hour ago

క్రేజీ వెంకీ… ఆదర్శ కుటుంబంలో AK 47

అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా…

3 hours ago

డేంజర్ జోన్లో జపాన్‌.. 2 లక్షల మందికి ముప్పు?

జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన "మెగాక్వేక్ అడ్వైజరీ" జారీ చేయడంతో అక్కడి ప్రజలు…

5 hours ago

చిరును పిల‌వ‌డానికి మంత్రులు వెళ్లేస‌రికి…

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌స్తుతం అన‌ధికార పెద్ద అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఒక‌ప్పుడు దాస‌రి నారాయ‌ణ‌రావులా ఇప్పుడు…

5 hours ago

జ‌గ‌న్‌ నిర్ణ‌యానికి చెక్‌, వారికి చంద్ర‌బాబు చ‌ల్ల‌ని క‌బురు!

గ‌త రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్ర‌బాబు తాజాగా చ‌ల్ల‌ని క‌బురు అందించారు. త‌మ…

6 hours ago

లంచం తీసుకున్నాడని ఉరిశిక్ష వేసిన ప్రభుత్వం

చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్‌హుయి అనే…

8 hours ago