సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది. 2015లో తులం బంగారం ధర రూ.24,740. 1987లో తులం బంగారం ధర రూ.2570. 2006లో తులం బంగారం ధర రూ.8250 మాత్రమే. ఈ లెక్కన 2030 నాటికి తులం బంగారం ధర రూ.2 లక్షలు కావడం ఖాయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
దేశీయ, విదేశీ స్టాక్ మార్కెట్లతో పాటు ఇతర పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గంగా మదుపరులకు బంగారమే కనిపిస్తున్న నేపథ్యంలో ధరలకు రెక్కలు వస్తున్నాయని చెబుతున్నారు. గడిచిన 9 ఏండ్లలో భారతీయ మార్కెట్లో బంగారం ధర మూడింతలైంది. ఇందుకు కారణం మదుపరులలో మారిన ఆలోచనా వైఖరేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఐదేండ్లలో బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, కరోనా మహమ్మారితో ఏర్పడిన పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటివి బంగారం ధరలు పెరగడానికి 75 శాతం కారణమయ్యాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం మీద పెట్టుబడులు తక్కువ రిస్క్ అని భావిస్తున్నారు. అందుకే బంగారం మీద పెట్టుబడులు భవిష్యత్తులో ఆకర్షణీయ లాభాలు కురిపిస్తాయని భావించి అటు వైపు మొగ్గు చూపుతున్నారు.
This post was last modified on May 2, 2024 12:32 pm
మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…
డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…
ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైనా కలర్ ఫోటోకు మంచి స్పందన వచ్చిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. కొత్త ప్రేమకథ కాకపోయినా…
అఖండ సినిమా ఓటీటీలో రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. డివైన్ ఎలిమెంట్స్తో తీసిన సినిమాలకు కొన్నేళ్ల నుంచి…
ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి…