ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. రాబోయే రెండు, మూడు రోజులలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధ్యమైనంత వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.
ఇక అదే సమయంలో తెలంగాణ, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయి ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 ఏండ్ల తర్వాత ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు చెబుతున్నారు. వాతావరణ శాఖ చెబుతున్న సమాచారం ప్రకారం 1921 తర్వాత 2024కు ముందు ఏ ఏడాదిలోనూ 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే రాష్ట్రంలోని పలుచోట్ల 44 డిగ్రీల ఊష్ణోగ్రత దాటడం విశేషం. రానున్న ఐదు రోజులలో దేశవ్యాప్తంగా వాతావరణం మరింత వేడెక్కుతుందని, ఈ ఐదురోజులలో దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే నెలలో కూడా గతంకన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని చెబుతున్నది.
This post was last modified on May 1, 2024 9:40 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…