కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ఒకటి. అయితే, అందులో సైడ్ ఎపెక్ట్స్ చాలా మంది అనారోగ్యానికి మరణాలకు కాారణం అవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే చాలా కొద్దిమందిలో మాత్రమే ఇది జరుగుతోంది. ఇప్పటివరకు ఈ వాదనను ససేమిరా అన్న సదరు సంస్థ.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా తన తప్పుల్ని తొలిసారి ఒప్పేసుకుంది.
ఆస్ట్రాజెనెకా అందించిన ఈ వ్యాక్సిన్ ను మన దేశంలో కొవిషీల్డ్స్ పేరుతో ఉత్పత్తి చేయటం తెలిసిందే. ఆస్ట్రాజెనెకా.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ డెవలప్ చేసిన కోవిషీల్డ్.. సీరమ్ ఇన్ స్టిట్యూట్ భారతదేశంలో పంపిణీ చేసింది. భారత్ లో తొలుత అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ సైతం కోవిషీల్డ్ అన్న సంగతి తెలిసిందే. స్వదేశీ సాంకేతికతో తయారైన కొవాగ్జిన్ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగటం.. అయితే మిగిలిన వ్యాక్సిన్లతో పోలిస్తే నిశ్చింతగా వేయించుకోవచ్చన్న హామీ లభించినప్పటికీ.. ప్రాశ్చాత్య మీడియాతో పాటు కొన్ని స్వదేశీ మీడియాలోని కొన్ని వర్గాల పుణ్యమా అని కొవాగ్జిన్ మీద తప్పుడు ప్రచారం భారీగా సాగింది.
కోవీషీల్డ్స్ వాడిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్న వైనం వెలుగులోకి రావటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. వాటిని ఖండించిన సంస్థ తాజాగా మాత్రం తప్పును ఒప్పుకుంది. కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్.. తక్కువ ప్లేట్ లెట్ కౌంట్ కు దారి తీసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదంటే తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు వంద మిలియన్ పౌండ్ల వరకు పరిహారాన్ని కోరుతూ యూకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2021 ఏప్రిల్ లో జామీ స్కాట్ న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు ఈ సంస్థపై కేసులు వేయటం షురూ చేశారు.
మొదట్లో తన మీద వచ్చిన విమర్శలు.. ఆరోపణల్ని తేలిగ్గా కొట్టేసిన సంస్థ.. తాజాగా మాత్రం తన తప్పులపై ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అయ్యింది. కోవిషీల్డ్ వినియోగించిన వారిలో అరుదైన సందర్భాల్లో థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్.. అంటే రక్తం గడ్డకట్టటం.. బ్లడ్ ప్లేట్ లెట్ కౌంట్ తక్కువ అవుతుందని అంగీకరించింది. గడిచిన కొద్ది కాలంగా హటాత్తుగా గుండెపోటుతో మరణించిన చాలామంది కొవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారే అన్న ప్రచారం సాగినా.. దానికి అవసరమైన ఆధారాలు లేకపోవటం తెలిసిందే. తాజాగా తమ వ్యాక్సిన్ లోని సైడ్ ఎఫెక్టులను అంగీకరించటం ద్వారా.. ఇంతకాలం తమపై వస్తున్న ఆరోపణల్లో కొంత నిజం ఉందన్న విషయాన్ని అంగీకరించినట్లైంది.
This post was last modified on April 30, 2024 11:59 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…