టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన ఈ ఘటనకు సంబంధించిన ప్రతి విషయం ఏదో ఒక సంధర్బంలో ప్రముఖ వార్త అవుతున్నది.
అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. టైటానిక్ షిప్ లో ప్రయాణించి, మరణించిన వారిలో అమెరికాకు చెందిన సంపన్నుడు జాన్ జేకబ్ ఆస్టర్ కూడా ఒకరు. భార్య మెడిలీన్ తో కలసి ఆయన టైటానిక్ లో ప్రయాణించారు. భార్యను వేరే బోట్ ఎక్కించి కాపాడి ఆయన మరణించారు.
ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత ఆయన మృతదేహంతో పాటు ఆయన ధరించిన బంగారు వాచ్ ను అప్పగించారు. ఆ తర్వాత ఆ వాచ్ రిపేర్ చేయించి పనిచేసేలా చేశారు. దానిని కొన్నాళ్లు అస్టర్ కుమారుడు ధరించాడు.
ఆ బంగారు వాచ్ ను తాజాగా ఇంగ్లాండ్ లో వేలం వేశారు. దానికి రికార్డు స్థాయిలో ధర పలికింది. వేలంలో లక్ష పౌండ్ల నుంచి లక్షన్నర పౌండ్ల వరకు అంటే సుమారు రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకు రావొచ్చని నిర్వాహకులు అంచనా వేశారు.
అయితే ఏకంగా 1.46 మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ. 12.17 కోట్లకు అమ్ముడుపోయిందని వాచ్ ను వేలం వేసిన సంస్థ హెన్రీ ఆల్డ్ రిడ్జ్ అండ్ సన్ ఈ విషయాన్ని తెలిపింది. టైటానిక్ కు చెందిన వస్తువులన్నింటిలో ఇదే అత్యంత ధర పలకడం విశేషం. అమెరికాకు చెందిన వ్యక్తి దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
This post was last modified on April 28, 2024 11:50 am
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…
కొన్ని నెలలు వెనక్కి వెళ్తే.. ప్రభాస్ సినిమా రాజాసాబ్ గురించి ఆ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ సప్తగిరి…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాణ స్వీకార…
ఈ నెల (మే) మొదటి రోజున హైదరాబాద్ కు చెందిన కుటుంబం.. సిరిసిల్లకు చెందిన మరో ఫ్యామిలీ కలిసి యాదాద్రి..…
కమల్ హాసన్ కల్ట్ కామెడీ మూవీస్ లిస్టులో సతి లీలావతిది ప్రత్యేక స్థానం. వచ్చి ముప్పై సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ…