Trends

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన ఈ ఘటనకు సంబంధించిన ప్రతి విషయం ఏదో ఒక సంధర్బంలో ప్రముఖ వార్త అవుతున్నది.

 అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. టైటానిక్ షిప్ లో ప్రయాణించి, మరణించిన వారిలో అమెరికాకు చెందిన సంపన్నుడు జాన్ జేకబ్ ఆస్టర్ కూడా ఒకరు. భార్య మెడిలీన్ తో కలసి ఆయన టైటానిక్ లో ప్రయాణించారు. భార్యను వేరే బోట్ ఎక్కించి కాపాడి ఆయన మరణించారు.

ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత ఆయన మృతదేహంతో పాటు ఆయన ధరించిన బంగారు వాచ్ ను అప్పగించారు. ఆ తర్వాత ఆ వాచ్ రిపేర్ చేయించి పనిచేసేలా చేశారు. దానిని కొన్నాళ్లు అస్టర్ కుమారుడు ధరించాడు.

ఆ బంగారు వాచ్ ను తాజాగా ఇంగ్లాండ్ లో వేలం వేశారు.  దానికి  రికార్డు స్థాయిలో ధర పలికింది. వేలంలో లక్ష పౌండ్ల నుంచి లక్షన్నర పౌండ్ల వరకు అంటే సుమారు రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకు రావొచ్చని నిర్వాహకులు అంచనా వేశారు.

అయితే ఏకంగా 1.46 మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ. 12.17 కోట్లకు అమ్ముడుపోయిందని వాచ్ ను వేలం వేసిన సంస్థ హెన్రీ ఆల్డ్ రిడ్జ్ అండ్ సన్ ఈ విషయాన్ని తెలిపింది. టైటానిక్ కు చెందిన వస్తువులన్నింటిలో ఇదే అత్యంత ధర పలకడం విశేషం. అమెరికాకు చెందిన వ్యక్తి దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం.

This post was last modified on April 28, 2024 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

2 hours ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

5 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

5 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

7 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

7 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

8 hours ago