ఈ గ్లోబల్ జమానాలో ప్రేమలు రాష్ట్రాలే కాదు దేశాలే కాదు ఖండాలు దాటుతున్నాయి. స్వచ్ఛమైన ప్రేమ కోసం యువతీ యువకులు ప్రపంచపు సరిహద్దులు చెరిపేస్తున్నారు. ప్రేమకు కులమతాలు..జాతి..అడ్డుకావని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రా అబ్బాయి, అగర్తలా అమ్మాల ప్రేమ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ NIT అగర్తలలో ఇంజనీరింగ్ చదివారు. చదువుకునే రోజుల్లో తన క్లాస్ మేట్ దాలియాను ప్రేమించారు. అగర్తలకు చెందిన దాలియాతో కలిసి అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. ఈ జంట ప్రేమకు ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న వారు ఇటీవల స్వదేశానికి వచ్చారు. ఈ నెల 24న గుంటూరులో ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో తెలుగు సాంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది.
ఈ నెల 29న దాలియా స్వస్థలమైన త్రిపుర రాజధాని అగర్తలలో వారి సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. త్రిపుర గవర్నర్ ఇంద్ర సేనారెడ్డితో వెంకట్రావుకు గతంలో పరిచయం ఉండడంతో ఆయనను వివాహానికి ఆహ్వానించారు. దీంతో, ఈ పెళ్లికి హాజరైన ఇంద్రసేనారెడ్డి నూతన వధూవరులు రామ్, దాలియాలను ఆశీర్వదించారు.
This post was last modified on March 1, 2024 2:04 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…