ఈ గ్లోబల్ జమానాలో ప్రేమలు రాష్ట్రాలే కాదు దేశాలే కాదు ఖండాలు దాటుతున్నాయి. స్వచ్ఛమైన ప్రేమ కోసం యువతీ యువకులు ప్రపంచపు సరిహద్దులు చెరిపేస్తున్నారు. ప్రేమకు కులమతాలు..జాతి..అడ్డుకావని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రా అబ్బాయి, అగర్తలా అమ్మాల ప్రేమ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ NIT అగర్తలలో ఇంజనీరింగ్ చదివారు. చదువుకునే రోజుల్లో తన క్లాస్ మేట్ దాలియాను ప్రేమించారు. అగర్తలకు చెందిన దాలియాతో కలిసి అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. ఈ జంట ప్రేమకు ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న వారు ఇటీవల స్వదేశానికి వచ్చారు. ఈ నెల 24న గుంటూరులో ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో తెలుగు సాంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది.
ఈ నెల 29న దాలియా స్వస్థలమైన త్రిపుర రాజధాని అగర్తలలో వారి సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. త్రిపుర గవర్నర్ ఇంద్ర సేనారెడ్డితో వెంకట్రావుకు గతంలో పరిచయం ఉండడంతో ఆయనను వివాహానికి ఆహ్వానించారు. దీంతో, ఈ పెళ్లికి హాజరైన ఇంద్రసేనారెడ్డి నూతన వధూవరులు రామ్, దాలియాలను ఆశీర్వదించారు.
This post was last modified on March 1, 2024 2:04 pm
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…