ఇప్పటి వరకు రాజకీయం కొన్ని రంగాలకే పరిమితమైంది. అయితే.. తాజాగా క్రికెట్లోనూ ఏపీ నేతల జోక్యం పెరిగిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ క్రికెట్ హనుమ విహారీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్తోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో ఏపీ నేతల పాత్ర పెరిగిపోయిందని హనుమ విహారీ వ్యాఖ్యానించాడు. ఏపీకి చెందిన ఓ రాజకీయ నేత(విజయసాయిరెడ్డి అనే ప్రచారం ఉంది) జోక్యం కారణంగా తాను తీవ్రంగా నష్టపోయానని ఆయన చెప్పాడు. ఈ కారణంగా తాను ఇక, ఆంధ్రాజట్టుకు ఆడేది లేదని తెగేసి చెప్పాడు.
అసలు ఏం జరిగింది?
ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మధ్యప్రదేశ్ చేతిలో ఆంధ్ర జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ రంజీ సీజన్ తొలి మ్యాచ్లో జట్టులోని 17వ ఆటగాడిపై తాను గట్టిగా మందలించానని విహారీ పేర్కొన్నాడు అయితే.. సదరు ఆటగాడు.. తన తండ్రి(ఓ నేత)కి చెప్పడంతో తనను టీంలో నుంచి తప్పించారని విహారీ ఆరోపించాడు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా ఆయన పేర్కొనడం గమనార్హం. నేత జోక్యం కారణంగా ఆంధ్రా జట్టు మేనేజ్మెంట్ తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఆదేశించిందన్నాడు.
ఆత్మగౌరవం పోయింది!
తన ఆత్మ గౌరవం పోయిందని విహారీ వ్యాఖ్యానించాడు. తాను చేయని తప్పునకు తనను మందలించినంత పనిచేశారని, కెప్టెన్సీ నుంచి తీసేశారని పేర్కొన్నాడు. తాను అంకిత భావంతో ఆంధ్రా జట్టుకు పనిచేశానని.. క్రీడలో భాగంగా సదరు క్రీడాకారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశానని.. దీనిని రాజకీయంగా వినియోగించుకుని తనను కెప్టన్సీ నుంచి తీసేయడం చాలా బాధాకరణమని వ్యాఖ్యానించాడు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా పేర్కొన్నాడు. ఇక పై తాను ఆంధ్ర జట్టు ఆడబోనని తేల్చి చెప్పాడు. కానీ, దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేత వైపు ప్రతిపక్షాల వేళ్లు చూపిస్తున్నాయి. మరి దీనిపై అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on February 26, 2024 10:32 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…